కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు?

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు?

ఈసారి రాములమ్మకు అవకాశం

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 09- తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యను భట్టి.. నాలుగు స్థానాలు రానున్నాయి.అయితే.. ఆ నాలుగింటిలో ఒక స్థానాన్ని మిత్రపక్షమైన సీపీఐకి కేటాయించింది హస్తం పార్టీ. కాగా.. మిగతా ముగ్గరు అభ్యర్థులపై తీవ్ర కసరత్తు చేసిన కాంగ్రెస్ నాయకత్వం.. పేర్లు ప్రకటించింది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా.. అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్ పేర్లను కాంగ్రెస్ నాయకత్వం ప్రకటించింది. మూడు స్థానాల్లో ఒకటి ఎస్సీ, ఒకటి ఎస్టీకి కేటాయించగా.. మరొకటి మహిళకు కేటాయిస్తూ.. అన్ని వర్గాలకు అవకాశం కల్పించే ప్రయత్నం చేసింది. అయితే.. ఈ ముగ్గురు అభ్యర్థుల ఎంపిక కోసం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్.. ఏఐసీసీ పెద్దలతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. రాష్ట్ర ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షీ నటరాజన్‌తో రాష్ట్ర నాయకులు జరిపిన జూమ్ మీటింగ్‌తో అభ్యర్థులు ఫైన ల్ అయినట్టు తెలుస్తోంది. కాగా.. గత ఎన్నికల్లో పోటీ చేసిన వారికి, కార్పొరేషన్ ఛైర్మన్ పదవుల్లో ఉన్నవారికి కాకుండా.. పార్టీకి చాలా రోజులుగా విధేయంగా ఉన్నవారికి, కీలక వ్యక్తులకు ఈసారి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్టు సమాచారం

  • Related Posts

    సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు

    సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు గౌరవ నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి గారి ఆదేశానుసారం. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ అనైతికం. అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజు సభాపతిని అడ్డం పెట్టుకొని…

    బీసీ ముస్లింలను మినహాయించి రిజర్వేషన్లు మతపరమైనవే – బీసీ ముస్లిం జేఏసీ

    బీసీ ముస్లింలను మినహాయించి రిజర్వేషన్లు మతపరమైనవే – బీసీ ముస్లిం జేఏసీ మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 15 :- బీసీ ముస్లింలకు 10% రిజర్వేషన్లు కల్పించాలని బీసీ ముస్లిం జేఏసీ డిమాండ్ చేసింది. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    28వ సారి రక్తదానం చేసి ప్రాణాన్ని కాపాడిన పురుషోత్తం

    28వ సారి రక్తదానం చేసి ప్రాణాన్ని కాపాడిన పురుషోత్తం

    డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం?

    డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం?

    సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు

    సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు

    గతంలో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు: సీఎం రేవంత్

    గతంలో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు: సీఎం రేవంత్