కట్టుకున్న భార్యపై అతి కిరాతకంగా హత్యాయత్నం చేసిన యువకుడు

తిరుపతి జిల్లా…పెళ్లకూరు మండలం

కట్టుకున్న భార్యపై అతి కిరాతకంగా హత్యాయత్నం చేసిన యువకుడు

👉ప్రేమించి పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్న సంవత్సరానికి వరకట్న వేధింపులు ఇప్పుడు హత్యాయత్నం

పెళ్లకూరు మండలం టెంకాయతోపు గుర్రపుతోటలో దారుణం..భార్య లక్ష్మిప్రియను అతి కిరాతకంగా స్క్రూడ్రైవర్‌తో పొడిచిన భర్త హేమంత్‌,లక్ష్మిప్రియ కేకలు విని కాపాడిని స్థానిక యువకులు
అక్కడికి చేరుకోవడంతో పరారైన భర్త హేమంత్‌..

శ్రీ కాళహస్తి కి చెందిన హేమంత్ కుమార్ అనే యువకుడు కడప జిల్లా రైల్వే కోడూరు చెందిన లక్ష్మీ ప్రియ అనే మహిళను ప్రేమించి పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నాడు. హేమంత్ కుమార్‌ పెళ్లైన కొద్ది రోజుల నుండే లక్ష్మీ ప్రియాను కట్నం డబ్బులు కోసం వేధించడం మొదలుపెట్టాడు. పలుమార్లు లక్ష్మీప్రియపై దాడి చేసి కట్నం డబ్బులు తెస్తావా తేవా లేకుంటే నేను ఇంట్లో నుంచి తరిమేస్తానని కొట్టడంతో తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి అక్కడే ఉంటుంది.వివాహమైన సంవత్సరానికి మగ బిడ్డకు జన్మనిచ్చిన లక్ష్మీప్రియను భర్త హేమంత్ కుమార్ అనుమానం పడడం మొదలుపెట్టాడు. గత నాలుగు నెలల క్రిందట భార్య వద్దకు వెళ్లి నిన్ను బాగా చూసుకుంటాను నాతో వచ్చేయి మనం వేరు కాపురం ఉందామని చెప్పి కాళహస్తిలోని ఓ గృహం అద్దెకు తీసుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం భార్యభర్తల మధ్య వివాదం చోటు చేసుకోవడంతో భార్యపై దాడి పాల్పడ్డాడు. దాడిలో గాయపడిన భార్యను ఆసుపత్రికి తీసుకెళ్తానని నమ్మబలికించి పెళ్లకూరు మండలం టెంకాయతోపు వద్దకు తీసుకు వచ్చి ఆ మహిళపై అత్యంత కిరాతకంగా స్క్రూడ్రైవర్‌తో పొడిచి కత్తితో దాడి చేశాడు. దాడి చేస్తున్న సమయంలో అటుగా వెళుతున్న నలుగురు యువకులు గమనించి ఆ మహిళను కాపాడారు. ఈ క్రమంలో నిందితుడు హేమంత్‌ అక్కడి నుంచి పరారైయ్యాడు. ప్రేమించి నమ్మబలికి ప్రేమ వివాహం చేసుకున్న ఆ మహిళపై అత్యంత కిరాతకంగా దాడి చేయడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో ఆ మహిళ చికిత్స పొందుతుంది. ఇప్పటికైనా బాధిత మహిళలకు తగు న్యాయం చేయవలసిందిగా బాధితులు కోరుతున్నారు.

  • Related Posts

    సినీ నటి జెత్వానీ కేసు… ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగింపు

    సినీ నటి జెత్వానీ కేసు… ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగింపు జెత్వానీని అరెస్ట్ చేసి ఇబ్బందులు పెట్టిన కేసు ఇప్పటికే సస్పెండ్ అయిన పీఎస్సార్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీ సస్పెన్షన్ మరో ఆరు నెలలు పొడిగింపు మనరంజని రంగారెడ్డి…

    అక్రమంగా తరలిస్తున్న ఇసుక వాహనం పట్టివేత అక్రమంగా ఇసుకను తరలిస్తే చర్యలు తప్పవు – తహసీల్దార్ లింగం మూర్తి మనోరంజని ప్రతినిధి తానూర్ మార్చి 13 – అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్ లింగం మూర్తి స్పష్టం చేశారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు .

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు .

    గుండెపోటుకు చైనా వ్యాక్సిన్!

    గుండెపోటుకు చైనా వ్యాక్సిన్!

    సినీ నటి జెత్వానీ కేసు… ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగింపు

    సినీ నటి జెత్వానీ కేసు… ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగింపు

    మధుసూధన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంఎల్సి నవీన్ కుమార్ రెడ్డి

    మధుసూధన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంఎల్సి నవీన్ కుమార్ రెడ్డి

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : పట్నం సునీత మహేందర్ రెడ్డి

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : పట్నం సునీత మహేందర్ రెడ్డి

    వింధ్య స్కూల్‌లో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహణ

    వింధ్య స్కూల్‌లో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహణ