ఉగాది సందర్భంగా బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగం

తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, “హిందువుల ప్రతి పండుగ శాస్త్రీయతతో పాటు గొప్ప సందేశాన్ని కూడా కలిగి ఉంటుంది. ఉగాది మనకు సామాజిక ఐక్యతను, కులాలకు అతీతంగా ప్రజలంతా కలిసి ఉండాలని సూచిస్తుంది” అని పేర్కొన్నారు. ఇటీవల భారత్ ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటోందని, “మోడీ నాయకత్వంలో మన దేశ ఖ్యాతి మరింత పెరుగుతోంది. కొత్త సంవత్సరం భారత ప్రజలకు శుభసూచకం కావాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.బీజేపీ కార్యకర్తలంతా కొత్త సంవత్సరంలో బలోపేతానికి కృషి చేయాలని, “ఇప్పటికే బూత్, మండల, జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు పూర్తయ్యాయి. త్వరలో రాష్ట్ర, జాతీయ కమిటీలు ఏర్పాటు చేస్తాము” అని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ “మన్ కీ బాత్” కార్యక్రమం త్వరలో ప్రారంభం కానున్నందున అందరూ వీక్షించాలని సూచించారు.

  • Related Posts

    విద్య, వైద్యం తప్ప మరేదీ ఫ్రీగా ఇవ్వకూడదు: వెంకయ్య నాయుడు

    ✒విద్య, వైద్యం తప్ప మరేదీ ఫ్రీగా ఇవ్వకూడదు: వెంకయ్య నాయుడు ఉచిత పథకాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అన్నీ ఫ్రీఫ్రీ అంటూ ఓట్ల కోసం జనాన్ని ఆకట్టుకుంటున్నారు. ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం లేదు.…

    రాజీవ్ యువ వికాసం పథకాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి

    రాజీవ్ యువ వికాసం పథకాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు దొండి రమణ.. మనోరంజని, హైదరాబాద్ ప్రతినిధి:రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని బీసీ సెల్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే