

ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి
మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :-
ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్ల డివిజన్ అధ్యక్షురాలు విజయ లక్ష్మి మాట్లాడుతూ ఆశ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల 18000 వేల వేతనాలన్ని చెల్లించాలని పిఎఫ్, ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఏఎన్ఎం ట్రైనింగ్ పూర్తి చేసిన అశాలకు, ఏఎన్ఎం పోస్టుల్లో ప్రమోషన్ సౌకర్యం కల్పించాలన్నారు. పని భారం తగ్గించి, పారితోషికం లేని విధులు నిర్వహించకుండా చూడాలన్నారు. డ్యూటీలు వేసే సందర్భంలో వెహికిల్స్ తో పాటు సిబ్బందిని ఎర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు రాధ, సులోచన, సావిత, అప్సరీ, ఇంద్ర, సుజాత, మమత, లత, యమున, తదితరులు పాల్గొన్నారు