ఆశ వర్కర్స్ పై లైంగిక దాడికి పాల్పడ్డ నిందితున్ని కఠినంగా శిక్షించాలి.

ఆశ వర్కర్స్ పై లైంగిక దాడికి పాల్పడ్డ నిందితున్ని కఠినంగా శిక్షించాలి.

సిఐటియు మల్కాజిగిరి మండల కార్యదర్శి బంగారు నర్సింగ్ రావు

మనోరంజని ప్రతినిధి జగిత్యాల మార్చి 07 :- జగిత్యాల జిల్లా రాయికల్ లో దళిత మహిళ, ఆశా వర్కర్స్ శివరాత్రి రోజున విధులు నిర్వహించుకుని ఇంటికి తిరిగి వెళుతున్న సందర్భంలో ఒక వ్యక్తి ఆమెను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడని సిఐటియు మల్కాజ్గిరి మండల కార్యదర్శి బంగారు నర్సింగరావు తెలియజేశారు. ఈ సందర్భంగా బంగారు నర్సింగరావు మాట్లాడుతూ ఘటన జరిగి వారం రోజులు అయినా ఇప్పటివరకు అత్యాచారానికి పాల్పడ్డ నిందితుని అరెస్టు చేయకపోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు. నిందితున్ని అరెస్టు చేయడంలో విఫలమైన జగిత్యాల జిల్లా డిఎస్పీని మరియు సంబంధిత పోలీస్ అధికారులను విధుల నుంచి సస్పెండ్ చేయాలి. అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అత్యాచారానికి ఒడిగట్టిన నిందితునిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వము మరియు పోలీసు ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలి. మహిళలకు రక్షణ కల్పించాలి. మహిళలపై జరుగుతున్న దాడులకు అత్యాచారాలకు వ్యతిరేకంగా ఆందోళన పోరాటాలను నిర్వహించి చట్ట ప్రకారం నష్టపరిహారం అందే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మల్కాజ్గిరి మండల నాయకులు కే. యాదగిరి, ఎం. కృష్ణమ్మ, చిట్టి బాయ్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను…

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్