అప్పుడే పుట్టిన ఆడబిడ్డకు రూ.4లక్షలు.. మగబిడ్డకు రూ.6లక్షలు..గుజరాత్ టూ…

అప్పుడే పుట్టిన ఆడబిడ్డకు రూ.4లక్షలు.. మగబిడ్డకు రూ.6లక్షలు..గుజరాత్ టూ…తెలంగాణ…. ఏపీ…..!పోలీసుల విచారణ లో వెలుగులోకి సంచలన నిజాలు..!

మనోరంజని ప్రతినిధి మార్చి 20


హైదరాబాద్

ఓ వందన..

ఇంకో సరోజిని..

మరో కృష్ణవేణి..

ఎవర్రా వీళ్లంతా అనుకుంటున్నారా..?

వీళ్లంతా పసికందుల్ని అమ్మేసి సొమ్ము చేసుకుంటున్న కిలేడీలు..!

గ్యాంగ్ అంతటికీ లీడర్‌ అమూల్య.

ఓ స్టేట్‌లో శిశువుల్ని కొని ఇంకో స్టేట్‌లో విక్రయించడం అమూల్య బిజినెస్..

పేరుకు ఆశా వర్కర్..

చేసిది మాత్రం పిల్లలను అమ్మే బిజినెస్..

ఎక్కడికక్కడ బ్రోకర్లను అపాయింట్ చేసుకుని నెట్‌వర్క్‌ను అంతకంతకు విస్తరించింది.

ఆ క్రమంలోనే రాచకొండ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది అమూల్య ముఠా…

తల్లి ఒడిలో పెరగాల్సిన చిన్నారులను ఏకంగా రాష్ట్రాలు దాటించి అమ్మేస్తోంది.

మొత్తం పదిమంది చిన్నారుల్ని రెస్క్యూ చేశారు రాచకొండ పోలీసులు.

కాపాడిన వారిలో ఆరుగురు ఆడ, నలుగురు మగ శిశువులు ఉన్నారు.

గుజరాత్‌, మహారాష్ట్రలో పిల్లలను కొని ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో అమ్ముతున్నారు.

చిన్నారులను రక్షించిన చైతన్యపురి పోలీసులు.. మధురానగర్లోని శిశు విహార్ కు తరలించారు. ఒక అబ్బాయి మినహా అంతా సంవత్సరంలోపు చిన్నారులేనని పోలీసులు తెలిపారు.

తల్లిదండ్రుల ఆచూకీ తెలిసేంతవరకు మధురానగర్లోని శిశు విహార సంరక్షణలో చిన్నారులను ఉంచనున్నారు. వారి తల్లిదండ్రుల ఆచూకీ తెలిసేంతవరకు వారి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని, వారి బాగోగులు చూడాలని శిశు విహార్ అధికారులకు మంత్రి సీతక్క ఆదేశించారు.. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని పోలీసులకు ఆదేశించారు.

తొమ్మిది మంది నిందితులతో పాటు 18 మంది పిల్లలను దత్తత తీసుకున్న తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు. మొత్తం 25 మంది శిశువుల అమ్మకాలు జరిగాయని.. 16 మందిని రెస్క్యూ చేయగా.. ఇంకా 9 మందిని రెస్క్యూ చేయాల్సి ఉందని తెలిపారు

  • Related Posts

    భార్య చెవి కోసి కమ్మలు తీసుకెళ్లిన భర్త

    : భార్య చెవి కోసి కమ్మలు తీసుకెళ్లిన భర్త మద్యానికి కట్టుకున్న తీసుకెళ్లిన మద్యానికి బానిసైన ఓ వ్యక్తి దారుణానికి బరితెగించారు. కట్టుకున్న భార్య చెవి కోసి అమ్మడానికి కమ్మలు తీసుకెళ్లిన ఘటన అనంతపురం జిల్లా. పెద్దపప్పూరు మండలం వరదాయపల్లి నికి…

    మానవత్వం చాటుకున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్

    మానవత్వం చాటుకున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ మనోరంజని ప్రతినిధి ప్రొద్దుటూరు మార్చి 22 :- స్ధానిక : ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తుతెలియని వృద్దుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతిని అంతిమ సంస్కరణలు చేయడానికి రెండు రోజులు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణకు గ్రామస్థాయి అధికారులు వస్తున్నారహో…

    తెలంగాణకు గ్రామస్థాయి అధికారులు వస్తున్నారహో…

    ట్రస్మా నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు

    ట్రస్మా నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు

    నగునూరులో పంట నష్టాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

    నగునూరులో పంట నష్టాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

    రెండు పాములు 80 పాము పిల్లలు మార్కాపురంలో చోటు చేసుకున్న అరుదైన ఘటన..

    రెండు పాములు 80 పాము పిల్లలు మార్కాపురంలో చోటు చేసుకున్న అరుదైన ఘటన..