Central Govt.: ఉపాధి హామీ కూలీలకు తీపి కబురు.. వేతనం పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు..

Central Govt.: ఉపాధి హామీ కూలీలకు తీపి కబురు.. వేతనం పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు..

దేశ వ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం (Central Government) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) కింద కూలీలకు వెతనం పెంచుతూ.. నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కనీస వేతనం రూ.300 నుంచి రూ.307లకు పెంచారు. అయితే పెంచిన వేతన 2024-25 కంటే రూ.7 అదనం. అయితే, పెరిగిన వేతనం ఏప్రిల్ 1 నుంచి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా అమల్లోకి రానున్నట్లుగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (Union Ministry of Rural Development) వెల్లడించింది. కాగా, ఉపాధి హామీ పథకం 2005లో ప్రారంభం అయినప్పటికీ.. అధికారంగా 2006లో అధికారికంగా ఆయా రాష్ట్రాల్లో అమలు చేశారు. ఈ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద కుటుంబాలకు కనీసం 100 రోజులు పని కల్పిస్తూ.. వారి జీవనోపాధిని మెరుగుపరచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తోంది. ఉపాధి హామీ పథకంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆర్థిక భద్రత, ఉపాధి దొరుకుంతుండటంతో పల్లెల నుంచి పట్టణాలకు వలస వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది

  • Related Posts

    తెలంగాణ మాజీ గవర్నర్ తమిళ్ సై కి పితృవియోగం

    తెలంగాణ మాజీ గవర్నర్ తమిళ్ సై కి పితృవియోగం మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:ఏప్రిల్ 09తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ తండ్రి, తమిళనాడు కాంగ్రెస్ మాజీ చీఫ్ కుమార్ అనంతన్ (93) ఈరోజు తెల్లవారు జామున చెన్నైలో…

    Waqf Amendment Act: అమల్లోకి వచ్చిన వక్ఫ్ చట్టం.. ప్రభుత్వ నోటిఫికేషన్ విడుదల..!!

    Waqf Amendment Act: అమల్లోకి వచ్చిన వక్ఫ్ చట్టం.. ప్రభుత్వ నోటిఫికేషన్ విడుదల..!! న్యూఢిల్లీ: పార్లమెంటులో గత వారం ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ చట్టం ఈరోజు (ఏప్రిల్ 8) నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారంనాడు ఒక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    గ్రామాల్లో ఘనంగా అంబలి బార్సి పండుగ

    గ్రామాల్లో ఘనంగా అంబలి బార్సి పండుగ

    కామారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నంద రమేష్ ఎన్నికఘన సన్మానం

    కామారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నంద రమేష్ ఎన్నికఘన సన్మానం

    కిసాన్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన పంతులు శ్రీనివాస్‌కు ఘన సన్మానం

    కిసాన్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన పంతులు శ్రీనివాస్‌కు ఘన సన్మానం

    భైంసా గణేష్ నగర్‌లో నీటి ట్యాంకుల అస్వచ్ఛతపై ఆరోపణలు

    భైంసా గణేష్ నగర్‌లో నీటి ట్యాంకుల అస్వచ్ఛతపై ఆరోపణలు