

BREAKING: కొత్త రూ.100, రూ.200 నోట్లు
త్వరలోనే రూ.100, రూ.200 నోట్లను జారీ చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఆర్బీఐ కొత్త గవర్నర్గా సంజయ్ మల్హోత్రా నియమితులైన నేపథ్యంలో ఆయన సంతకంతో ఈ నోట్లు రానున్నాయి. మహాత్మా గాంధీ సిరీస్లోనే కొత్త నోట్లు ఉంటాయని RBI పేర్కొంది. ఇవి అందుబాటులోకి వచ్చినా పాతవి చెల్లుతాయని వెల్లడించింది