స్వర్గీయ జాధవ్ జైవంతరావ్ కుటుంబాన్ని పరామర్శించిన రెహమాన్ ఫౌండేషన్ సభ్యులు

స్వర్గీయ జాధవ్ జైవంతరావ్ కుటుంబాన్ని పరామర్శించిన రెహమాన్ ఫౌండేషన్ సభ్యులు

రెహమాన్ ఫౌండేషన్ ద్వారా మృతుని కుటుంబానికి 8000/- వేల రూపాయల నిత్యావసర కిరాణా సరుకులు అందజేత

రెహమాన్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు అభినందనీయం :

జాధవ్ నాను నాయక్ (మాజీ సర్పంచ్ మోతిపటార్)

ప్రతి పేదోడికి రెహమాన్ ఫౌండేషన్ అండగా ఉంటుంది : చైర్మన్ డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలాని

మనోరంజని ప్రతినిధి లింగాపూర్ మార్చి 05 :- బుధవారం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం, మోతీపటార్ గ్రామానికి చెందిన పేదరైతు స్వర్గీయ జాధవ్ జైవంతరావ్ గత కొద్ది రోజుల క్రితం స్వర్గస్థులు కాగా బుధవారం దశదిన పెద్దకర్మ కార్యక్రమం కోసం రెహమాన్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొని నివాళి అర్పించారు. రెహమాన్ ఫౌండేషన్ చైర్మన్ : డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలానీ మృతుని ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. రెహమాన్ ఫౌండేషన్ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా చైర్మన్ డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలానీ సహకారంతో…… ఫౌండేషన్ లింగాపూర్ మండల ఇంచార్జి సభ్యులు జాటోత్ దవిత్ కుమార్ ద్వారా మృతుని సతీమణి కవితా బాయికి 8000/- వేల రూపాయలు నిత్యావసర కిరాణా సరుకులను అందిజేశారు. కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలని ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ పేద కుటుంబానికి రెహమాన్ ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మనోధైర్యానిచ్చారు. ఈ కార్యక్రమంలో రాథోడ్ రంజిత్, రాథోడ్ సుభాష్, జాధవ్ రవీందర్, జాధవ్ మారుతీ, జాధవ్ రంజిత్, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు ఉన్నారు.!!

  • Related Posts

    “భైంసా పట్టణంలో ఆడిటోరియం – సమగ్ర అభివృద్ధికి అవసరం “

    వాడేకర్ లక్ష్మణ్ఆనంధీత ఫౌండేషన్ చైర్మన్మోటివేషన్ స్పీకర్* భైంసా పట్టణంలో ఒక ఆధునిక ఆడిటోరియం నిర్మించడం అత్యంత అవసరం. ఇది విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, యువతకు, ప్రభుత్వ కార్యక్రమాలకు, సాంస్కృతిక సంఘాలకు ఒక గొప్ప వేదికగా నిలుస్తుంది. ప్రస్తుతానికి పెద్ద కార్యక్రమాలు నిర్వహించేందుకు తగిన…

    నేడు స్టేషన్‌ఘన్‌పూర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి..!!

    నేడు స్టేషన్‌ఘన్‌పూర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి..!! .800 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం స్వయం సహాయక సంఘాలకు రూ.100 కోట్ల రుణాల పంపిణీ అనంతరం కృతజ్ఞత సభలో ప్రసంగించనున్న సీఎం ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భారీగా ఏర్పాట్లు వరంగల్‌: ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆదివారం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    “భైంసా పట్టణంలో ఆడిటోరియం – సమగ్ర అభివృద్ధికి అవసరం “

    “భైంసా పట్టణంలో ఆడిటోరియం – సమగ్ర అభివృద్ధికి అవసరం “

    తమిళ భాషపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు

    తమిళ భాషపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు

    నేడు స్టేషన్‌ఘన్‌పూర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి..!!

    నేడు స్టేషన్‌ఘన్‌పూర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి..!!

    ఓటర్, ఆధార్ లింకింగ్‌పై 18న కీలక సమావేశం

    ఓటర్, ఆధార్ లింకింగ్‌పై 18న కీలక సమావేశం