

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి గెలుపు పట్ల హర్షం
మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 04 :-ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి మల్కా కొమురయ్య గెలుపొందడం పట్ల బిజెపి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మండల కేంద్రమైన ముధోల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఇంచార్జ్ ధర్మపురి సుదర్శన్ -మండల అధ్యక్షుడు కోరిపోతన్న ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ఉపాధ్యాయులకు స్వీట్లు తినిపించి సంబరాలు జరుపుకున్నారు. ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థికి మద్దతు తెలిపి గెలుపుకు సహకరించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న కృషికి మద్దతు పలకడం అభినందనీయమన్నారు. పట్టభద్రులు ఎన్నికల్లో సైతం బిజెపి అభ్యర్థి గెలుపు దిశగా ముందుకెళ్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు దేవోజి భూమేష్, మాజీ ఉపసర్పంచ్ మోహన్ యాదవ్, సోషల్ మీడియా ఇన్ఛార్జి ధర్మారం నరేష్ గుప్తా, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు