పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వ అండ తప్పనిసరి –మాజీ సర్పంచ్ రాజేందర్ డిమాండ్

పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వ అండ తప్పనిసరి –

మాజీ సర్పంచ్ రాజేందర్ డిమాండ్

మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 24 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని ముధోల్ గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ పారిశుద్ధ్య కార్మికుడు సొన్ కాంబ్లే శంకర్ అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషాద ఘటనపై ముధోల్ మాజీ సర్పంచ్ రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజేందర్ మాట్లాడుతూ, పారిశుద్ధ్య కార్మికులకు లేబర్ చట్టాల ప్రకారం కనీస వేతనం, పెన్షన్, జీవిత భీమా, హెల్త్ ఇన్సురెన్స్ ఇవ్వాలని, అలాగే నెల మొదటి తేదీన వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య కార్మికుడి మరణించిన ప్రతి సందర్భంలో బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల పరిహారం అందించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. “వేల కోట్లు ఉచిత పథకాలకు ఖర్చు చేస్తూన్న ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయాలి,” అని రాజేందర్ హితవిచ్చారు. డిమాండ్లు:
పారిశుద్ధ్య కార్మికులను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలి

లేబర్ చట్టాల ప్రకారం కనీస వేతనం అందించాలి

జీవిత భీమా, హెల్త్ ఇన్సురెన్స్ అమలు చేయాలి

నెల మొదటి తేదీన వేతనాలు చెల్లించాలి

మృతి చెందిన కార్మిక కుటుంబానికి రూ. 20 లక్షల పరిహారం అందించాలని కోరారు.

  • Related Posts

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 30 :- నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ సభ్యుల సమావేశంలో తోట రఘు…

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క,ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్‌కు కృతజ్ఞతలు ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం తెలంగాణ ప్రభుత్వం గోరు బోలి (లంబాడా) భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చేందుకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం