

సైన్స్ ప్రదర్శన: విద్యార్థుల సృజనాత్మకతకు ప్రోత్సాహం
మనోరంజని ప్రతినిధినిర్మల్ : ఫిబ్రవరి 28 :- నిర్మల్ జిల్లా సోన్ మండలం, సిద్ధులకుంట గ్రామ ఉన్నత పాఠశాలలో సైన్స్ దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ప్రముఖ శాస్త్రవేత్త సి.వి. రామన్ చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల శాస్త్రీయ ప్రయోగాలను ప్రదర్శించారు. తాము రూపొందించిన ప్రయోగాలను ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులకు వివరించారు. ఈ ప్రదర్శన విద్యార్థుల సృజనాత్మకతకు దర్పణమని, శాస్త్ర విజ్ఞానాన్ని అర్థం చేసుకోవడంలో ఎంతో ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. సైన్స్ ఉపాధ్యాయుడు టి. నరేందర్ మాట్లాడుతూ, “శాస్త్ర విజ్ఞానం లేకుండా మానవ జీవనం అసాధ్యం. ఏ విషయాన్ని గుడ్డిగా నమ్మకుండా శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించాలి” అని సూచించారు. విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు హరీష్ రెడ్డి, ఉపాధ్యాయులు కడారి దశరథ్, చంద్రశేఖర్ రావు, టి. నరేందర్, బి. నరేందర్, భూమా రెడ్డి, ముర్తూజా ఖాన్ తదితరులు పాల్గొన్నారు.