

ఆశ వర్కర్స్పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ
మనోరంజని ప్రతినిధి మల్కాజిగిరి మార్చి :- 13 మల్కాజిగిరి మండల కమిటీ ఆశ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఆశ వర్కర్పై జరిగిన అత్యాచారం పై న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మల్కాజిగిరి చౌరస్తా వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సీఐటీయూ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నాయకులు, మండల కార్యదర్శి బంగారు నర్సింగరావు నేతృత్వంలో జరిగింది. ఈ సందర్భంగా ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఏ. హేమలత మాట్లాడుతూ, నిందితుడిని తక్షణమే అరెస్టు చేసి, ఎస్డీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఫస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేసి విచారణ చేపట్టి కఠిన శిక్ష విధించాలని కోరారు.ఆశ వర్కర్స్పై పని భారం తగ్గించాలి, నైట్ డ్యూటీలు రద్దు చేయాలి, వర్కర్లకు రక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ నిరసన ర్యాలీలో టి హేమలత, వసంత, కే. రాణి, భారతి, సురేఖ, మహిశ్వరి, స్వప్న, అనిత సహా అనేక మంది ఆశ వర్కర్స్ పాల్గొన్నారు
