

ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ను తమిళనాడు పీడబ్యూడీ శాఖ మంత్రి ఈ.వి.వేలు, రాజ్యసభ ఎంపీ విల్సన్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ నెల 22న చెన్నైలో జరుగనున్న దక్షిణభారత అఖిలపక్ష నాయకుల సమావేశానికి హాజరు కావాలని జగన్ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ రాసిన లేఖను అందజేశారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై దక్షిణ భారత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల అధినేతలతో చర్చించేందుకు డీఎంకే ప్రభుత్వం ఈ సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ క్రమంలో వైయస్ జగన్ను ఆహ్వానించేందుకు డీఎంకే నేతలు ప్రత్యేకంగా తాడేపల్లి వచ్చారు.


