నీటి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తా

నీటి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తా

పంచాయతీ కార్యదర్శి అన్వర్ అలీ

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 12 :-వేసవికాలంలో ప్రజలకు నీటి సమస్యను తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని పంచాయతీ కార్యదర్శి అన్వర్ అలీ అన్నారు. బుధవారం మండల కేంద్రమైన ముధోల్ లోని ఎస్సీ కాలనీలో నీటి కనెక్షన్ ను మినీ వాటర్ ట్యాంక్ కు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటిని వృధా కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇప్పటికే వార్డుల వారీగా నీటి వృధాను గుర్తించడం జరిగిందన్నారు. సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. నీటి వృధాను అరికట్టేందుకు అవసరమైన చర్యలు సైతం తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రజలు సైతం తమ వార్డు పరిధిలో నీటి సమస్య తలెత్తితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. ఇప్పటికే వేసవికాలంలో త్రాగునీటి సమస్యను తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవడంలో భాగంగా ఎంపీడీవో శివకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామసభను ఏర్పాటు చేసి స్థానికుల అభిప్రాయాలను తీసుకోవడం జరిగిందన్నారు. పారిశుద్ధ్యం-త్రాగునీటి సమస్య -వీధి దీపాల- నిర్వహణ తో పాటు ఇంటింటి నుండి చెత్తను సేకరించే పనులను సక్రమంగా చేపట్టే విధంగా చూస్తున్నామన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలవకుండా అన్ని రకాలుగా ముందుకు వెళ్తున్నామని వివరించారు

  • Related Posts

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ మనోరంజని ప్రతినిధి మల్కాజిగిరి మార్చి :- 13 మల్కాజిగిరి మండల కమిటీ ఆశ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఆశ వర్కర్‌పై జరిగిన అత్యాచారం పై న్యాయం చేయాలని…

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల.

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల. మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 13 :- నిర్మల్ జిల్లా : ప్రశాంత వాతావరణంలో హోలీ పండుగ జర్రుపుకోవకని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు గురువారం వారి కార్యాలయం నుండి ప్రకటన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    భార్యలు తాగుతున్నారని పోలీస్ స్టేషన్లో భర్తల ఫిర్యాదు!

    భార్యలు తాగుతున్నారని పోలీస్ స్టేషన్లో భర్తల ఫిర్యాదు!

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల.

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల.

    సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీఎంకే నేతలు.. కారణమిదేనా..

    సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీఎంకే నేతలు.. కారణమిదేనా..