పాకిస్తాన్ రైలు హైజాక్..20మంది సైనికులను చంపేశాం..బలూచిస్తాన్ టెర్రరిస్టులు..!!

పాకిస్తాన్ రైలు హైజాక్..20మంది సైనికులను చంపేశాం..బలూచిస్తాన్ టెర్రరిస్టులు..!!

పాకిస్తాన్ రైలు హైజాక్ చేసిన బలూచిస్తాన్ వేర్పాటు వాద టెర్రరిస్టులు 20మంది పాక్ సైనికులను చంపేసినట్లు ప్రకటించారు. మంగళవారం (మార్చి11) పాకిస్తాన్ లోని పర్వత ప్రాంతాల్లో బలూ లిబరేషన్ ఆర్మీకి చెందిన టెర్రరిస్టులు రైలును హైజాక్ చేసి దాదాపు 450 మంది ప్రయాణికులను బంధించిన విషయం తెలిసిందే.అయితే బంధించిన వారిలో మహిళలు, పిల్లలు, వృద్ధులను, బలూచిస్తాన్ పౌరులను 182మందిని విడిచిపెట్టినట్లు తెలిపారు. పాక్ సైన్యం జోక్యం గనక చేసుకుంటే బందీలుగా ఉన్న వారిని ఉరితీస్తామని ఉగ్రవాద సంస్థ హెచ్చరించింది. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ సరిహద్దులో ఉన్న బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం పనిచేస్తున్న బలూ లిబరేషన్ ఆర్మీ ఈ హైజాక్ చేసింది. క్వెట్టానుంచి పెషావర్ కు వెళ్తున్న జాఫర్ ఎక్స్ ప్రెస్ ను పాకిస్తాన్ పర్వత ప్రాంతాల్లో ఉగ్రవాదులు హైజాక్ చేశారు. ఈ ప్రాంతంలో 17 సొరంగాలు ఉండగా.. 8వ నంబర్ టన్నెల్ దగ్గర సాయుధ ఉగ్రవాదులు రైలును ఆపారు. ఈ సొరంగాల లోపల రైళ్ల వేగం తరచుగా నెమ్మదిగా ఉంటుంది. రైల్వే ట్రాక్‌పై బాంబు దాడి చేసి ఆపై హైజాక్ చేసినట్లు తెలుస్తోంది. తిరుగుబాటుదారులకు నిలయంగా ఉన్న బలూచిస్తాన్ లో బలూచ్ జాతీయవాద ఉగ్రవాదులు ఈ ప్రావిన్స్ వనరులలో ఎక్కువ వాటాను డిమాండ్ చేస్తున్నారు. గతేడాది కరాచీ విమానాశ్రయానికి సమీపంలోని పోర్ట్ ఖాసిమ్ ఎలక్ట్రిక్ పవర్ కో దగ్గర చైనా కార్మికుల కాన్వాయ్‌ను లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ దాడిలో ఇద్దరు చైనా జాతీయులు మృతిచెందారు

  • Related Posts

    భార్యలు తాగుతున్నారని పోలీస్ స్టేషన్లో భర్తల ఫిర్యాదు!

    భార్యలు తాగుతున్నారని పోలీస్ స్టేషన్లో భర్తల ఫిర్యాదు! మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 13 – మా ఇంటాయన తాగు బోతు అయిపోయాడు.. సంసారం నాశనమైపోతుం దని అడవాళ్లు ఆవేదన వ్యక్తం చేయడం సహజం. కానీ, ఇక్కడ మాత్రం మా ఆడాళ్లు తాగుబోతులైపోయారని,…

    ఫామ్‌హౌస్ కేసు.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీకి రెండోసారి నోటీసులు..

    ఫామ్‌హౌస్ కేసు.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీకి రెండోసారి నోటీసులు.. హైదరాబాద్: ఫామ్‌హౌస్‌లో కోడిపందాల కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మొయినబాద్ పోలీసులు రెండోసారి నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మాదాపూర్‌లో ఉంటున్న ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    భార్యలు తాగుతున్నారని పోలీస్ స్టేషన్లో భర్తల ఫిర్యాదు!

    భార్యలు తాగుతున్నారని పోలీస్ స్టేషన్లో భర్తల ఫిర్యాదు!

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల.

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల.

    సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీఎంకే నేతలు.. కారణమిదేనా..

    సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీఎంకే నేతలు.. కారణమిదేనా..