మూడు కోట్ల 97 లక్షల రూపాయలతో అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే….

మూడు కోట్ల 97 లక్షల రూపాయలతో అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే….

విద్యాభివృద్ధి ద్యేయంగా ముందుకు సాగుతానని, నియోజకవర్గం విద్యారంగంలో మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. మంగళవారం బైంసాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర ప్రభుత్వ నిధులు ఉషా పథకం కింద మూడు కోట్ల 97 లక్షల రూపాయలతో నిర్మించనున్న అదనపు గదుల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేసిన సందర్భంగా మాట్లాడారు. కళాశాల అభివృద్ధికి మొత్తం ఐదు కోట్ల రూపాయల నిధులు మంజూరు కావడం జరిగిందని, మిగతా నిధులను కళాశాలలో కంప్యూటర్ లు, ఇతరత్రా పనుల కోసం వెచ్చిస్తామన్నారు. కళాశాల అభివృద్ధి కోసం ప్రిన్సిపల్ అధ్యాపకులు పనిచేస్తున్న తీరును ఆయన అభినందించారు. విద్యార్థులు లక్ష్యసాధన తో ముందుకు సాగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కళాశాల అధ్యాపక బృందం ఘనంగా స్వాగతించి, శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కే. బుచ్చయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ బి గంగాధర్ , డాక్టర్ నగేష్ తో పాటు పట్టణ మండల బిజెపి నాయకులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ మనోరంజని ప్రతినిధి మల్కాజిగిరి మార్చి :- 13 మల్కాజిగిరి మండల కమిటీ ఆశ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఆశ వర్కర్‌పై జరిగిన అత్యాచారం పై న్యాయం చేయాలని…

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల.

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల. మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 13 :- నిర్మల్ జిల్లా : ప్రశాంత వాతావరణంలో హోలీ పండుగ జర్రుపుకోవకని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు గురువారం వారి కార్యాలయం నుండి ప్రకటన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    భార్యలు తాగుతున్నారని పోలీస్ స్టేషన్లో భర్తల ఫిర్యాదు!

    భార్యలు తాగుతున్నారని పోలీస్ స్టేషన్లో భర్తల ఫిర్యాదు!

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల.

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల.

    సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీఎంకే నేతలు.. కారణమిదేనా..

    సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీఎంకే నేతలు.. కారణమిదేనా..