

పేదల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది:
ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ :
మనోరంజని ప్రతినిధి ఖానాపూర్ మార్చి 11 :- ఇంద్రవెల్లి : పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, పేదలకు మేలు చేరుకురెలా ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు.మంగళవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో 20 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాది ముభారక్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మీ,షాది ముభారక్ పథకం ఆర్థికంగా ఎంతో తోడ్పాటును అందిస్తుందన్నారు.వేసవి కాలం సమీపిస్తున్న తరుణంలో అధికారులు నీటి ఉన్న గ్రామాలను గుర్తించి,నీటి సమస్యలను తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు
