ట్రంప్ ఉక్కుపాదం….లక్ష మంది భారతీయుల్లో H4 వీసా టెన్షన్..

ట్రంప్ ఉక్కుపాదం….లక్ష మంది భారతీయుల్లో H4 వీసా టెన్షన్..

మనోరంజని ప్రతినిధి మార్చి 07


రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు ట్రంప్. అక్రమంగా తమ దేశంలోకి వచ్చిన వారిపైనే కాదు, వీసా గడువు ముగిసాక కూడా అమెరికాలో ఉంటున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. దీంతో అమెరికాలో నివసిస్తున్న భారతీయులు భయాందోళనకు గురవుతున్నారు. హెచ్1బీ వీసా పొందిన వారిపై ఆధారపడిన వారు అంటే వారి పిల్లలు డిపెండెంట్ వీసా-హెచ్4 కింద అమెరికాకు వెళ్లొచ్చు. అక్కడకు వెళ్లిన మైనర్లకు 21 ఏళ్లు వచ్చే వరకు ఈ వీసా పని చేస్తుంది. ఆ తర్వాత రెండేళ్లు సమయం ఇస్తారు. ఆలోపు కొత్త వీసా తీసుకోవాలి.

డిపెండెంట్ వీసాపై వెళ్లిన లక్షా 34 వేల మంది భారతీయుల వీసా గడువు ముగింపు దశకు వచ్చినట్లు అమెరికా వర్గాలు చెప్తున్నాయి. వీసా గడువు ముగుస్తున్న వారికి ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది. ట్రంప్ చెప్తున్నట్లు అమెరికాను వీడి వెళ్లక తప్పదా అన్న ఆందోళన నెలకొంది. వీసా గడువు ముగిసే వాళ్లు ఉన్నత చదువుల కోసం స్టూడెంట్ వీసా ఎఫ్-1కు దరఖాస్తు చేసుకోవచ్చు. కాని ఇది తీసుకోవాలంటే అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్టూడెంట్ వీసా పొందితే.. అంతర్జాతీయ విద్యార్థుల కింద నమోదు అవుతారు. దీని వల్ల భవిష్యత్తులో స్కాలర్‌షిప్ సహా ఇతర ప్రభుత్వ సాయానికి దూరం అవుతారు. దీంతో వారంతా ఈ స్టూడెంట్ వీసా తీసుకోలేక.. గడువు ముగిశాకా ఏం చేయాలో పాలుపోక ఆందోళనకు గురవుతున్నారు.

  • Related Posts

    డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం?

    డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం? US అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 41 దేశాలకు పైగా ప్రజలకు ప్రయాణ ఆంక్షలు విధించాలని ఆయన భావిస్తున్నట్లు రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది. దాని ప్రకారం.. అఫ్ఘాన్, పాకిస్థాన్, భూటాన్,…

    అంతరిక్ష ప్రయోగాల ద్వారా ఇస్రోకి రూ 1,243 కోట్ల ఆదాయం

    అంతరిక్ష ప్రయోగాల ద్వారా ఇస్రోకి రూ 1,243 కోట్ల ఆదాయం విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం ద్వారా ఇస్రో రూ.1,243 కోట్లు ఆర్జించినట్లు కేంద్రమంత్రి జితేంద్రసింగ్ వెల్లడించారు. భారత్ పంపిన ఉపగ్రహాల్లో అత్యధికంగా అమెరికా(232), ఇంగ్లండ్ (83), సింగపూర్ (19) దేశాలకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    “భైంసా పట్టణంలో ఆడిటోరియం – సమగ్ర అభివృద్ధికి అవసరం “

    “భైంసా పట్టణంలో ఆడిటోరియం – సమగ్ర అభివృద్ధికి అవసరం “

    తమిళ భాషపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు

    తమిళ భాషపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు

    నేడు స్టేషన్‌ఘన్‌పూర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి..!!

    నేడు స్టేషన్‌ఘన్‌పూర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి..!!

    ఓటర్, ఆధార్ లింకింగ్‌పై 18న కీలక సమావేశం

    ఓటర్, ఆధార్ లింకింగ్‌పై 18న కీలక సమావేశం