

6 నెలల్లోపు పెట్రోల్ కార్ల ధరలకే ఈవీలు : గడ్కరీ
మనోరంజని ప్రతినిది మార్చి 20 – ఢిల్లీలోని 32వ కన్వర్జెన్స్ ఇండియా, 10వ స్మార్ట్ సిటీస్ ఇండియా ఎక్స్పోలో కేంద్ర మంత్రి గడ్కరీ ప్రసంగించారు. రానున్న 6 నెలల్లో దేశంలో పెట్రోల్ వాహనాలు, విద్యుత్ వాహనాల ధరలు ఒకే విధంగా ఉంటాయన్నారు. 212 కి.మీల మేర నిర్మిస్తున్న ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్వే త్వరలో పూర్తవుతుందన్నారు. దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు.. మౌలిక సదుపాయాల రంగాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యనించారు