

జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలి.
-ఇంచార్జీ ఆనంద్ రావ్ పటేల్.



మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 29 :-నిర్మల్ జిల్లా – సారంగాపూర్:
జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సారంగాపూర్ ఇంచార్జీ భైంసా మార్కెట్ ఛైర్మన్ ఆనంద్ రావ్ పటేల్ అన్నారు శుక్రవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొల్లోజి నర్సయ్య ఆద్వర్యంలో చేపట్టిన జై బాపు జై బీమ్ జై సంవిధన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్బంగా పలువురు మాట్లాడారు..కేంద్రంలో పాలిస్తున్న బిజెపి పార్టీ భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ఆప్రజాస్వామ్య పాలన కొనసాగిస్తుందని అన్నారు.
మనుషులంతా ఒకటేనని భారత పౌరులందరికీ సమాన హక్కును కల్పించిన రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యతని అన్నారు. బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.ముందుగా సామూహికంగా ప్రతిజ్ఞ చేసారు.ఈ కార్యక్రమంలోమాజీ జడ్పీటీసీ రాజేశ్వర్ రెడ్డి ,బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు దశరథ్ రాజేశ్వర్,కిసాన్ సెల్ జిల్లా చైర్మన్ పొత్తరెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ముత్యం రెడ్డి , నారాయణరెడ్డి,మారుతి,రవీంధ్రనాథ్ రెడ్డి,మధుకర్, భొజన్న,సత్యపాల్ రెడ్డి,భోజ గౌడ్,సలీం,పోత రెడ్డి,ముక్తార్,
రాజన్న,సురేందర్,కైలస్,సుమన్,సూర్యం, మండల కాంగ్రెస్ క్రియాశీల కార్యకర్తలు పాల్గొన్నారు..