

మోడీ అప్రజాస్వామిక విధానంపై కాంగ్రెస్ పోరు: వినోద్
ప్రతీ ఇంటికీ జైబాపు, జైభీమ్ నినాదం తీసుకెళ్తాం: కేఎల్ఆర్
రాజ్యాంగంపై బీజేపీ దాడి చేస్తోంది
ఏప్రిల్ 2 నుంచి పల్లెపల్లెన జైసంవిధాన్ అభియాన్
మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి

మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 27 : దేశంలో ప్రధాని నరేంద్రమోడీ పాలన అప్రజాస్వామికంగా కొనసాగుతుందని జైబాపు, జైభీమ్, జైసంవిధాన్ కార్యక్రమ ఇన్ఛార్జి వినోద్ అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వినోద్,మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి,జిల్లా మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, దేపభాస్కర్ రెడ్డి, బడంగ్ పెట్ మాజీ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
భారత రాజ్యాంగం, అంబేద్కర్ పై హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ చేస్తున్న అంతర్గత దాడి, దేశాన్ని ముక్కులు చేసే కుట్రపై కాంగ్రెస్ అగ్రనాయకత్వం దేశవ్యాప్తంగా ఓ ఉద్యమాన్ని చేపట్టిందని వినోద్ చెప్పారు. ఈ సంధర్భంగా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కులగణన చేసి తెలంగాణలో రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు కల్పించి సీఎం రేవంత్ రెడ్డి దేశానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.రాజ్యాంగం కల్పించిన అన్ని రాజకీయ అవకాశాలు ప్రతీ ఒక్కరికీ దక్కేలా కృషి చేస్తానని కేఎల్ఆర్ హామీ ఇచ్చారు. స్వాతంత్ర్య పితామహుడు గాంధీజీని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ని దేశం మరిచిపోయేలా బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్రలు చేస్తుందని లక్ష్మారెడ్డి ఆరోపించారు.ఇటీవల హత్య చేయబడ్డ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అడ్వకేట్ ఇజ్రాయిల్ ఆత్మకు శాంతి చేకూరాలని సమావేశంలో మౌనం పాటించారు కాంగ్రెస్ నేతలు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ కృష్ణానాయక్, ఏనుగు జంగారెడ్డి, జేఏసీ ఛైర్మన్ రఘుపతి, వైఎస్ ఛైర్మన్ చాకలి యాదయ్య, డైరెక్టర్లు గోవర్దన్ రెడ్డి, మధుసూదన్ రావు, శివగళ్ల యాదయ్య, నాగేందర్ రెడ్డి, సుభాన్ యాదవ్, ఎస్సీ సెల్ నరసింహ, శ్రీధర్, బోయిన శంకర్ యాదవ్, పున్నా గణేష్, భాస్కర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, బాల్ రెడ్డి, సరికొండ జగన్, పాండు సహా కాంగ్రెస్ నాయకులు, మహిళ నేతలు పాల్గొన్నారు.