భూమి మీదకు వచ్చేస్తున్న సునీతా విలియమ్స్‌

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 18 – అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్‌ విల్మోర్‌ తిరుగు ప్రయాణం కొనసాగుతోంది. ఐఎస్‌ఎస్‌ నుంచి స్పేస్‌ఎక్స్‌ క్రూ డ్రాగన్‌ లోకి వారిద్దరితో పాటు మ రో ఇద్దరు వ్యోమగాములు చేరుకున్నారు. ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఐఎస్‌ఎస్‌ నుంచి విడిపోయింది.అన్‌డాకింగ్‌ ప్రక్రియ అనంతరం స్పేస్‌క్రాఫ్ట్‌ భూమి దిశగా బయలుదేరింది. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారు జామున 3:30 గంటలకు భూవాతావరణంలోకి అది ప్రవేశిస్తుంది. ఆ వెంటనే ఇంజిన్ల ప్రజ్వలన చేపడతారు. అనంతరం తెల్లవారాజుమున 3.27 గంటలకు స్పేస్‌క్రాఫ్ట్ అమెరి కాలోని ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లోకి వస్తుంది.

వ్యోమగాములను అక్కడి సహాయ బృందాలు బయటకు తీసుకువస్తాయి.

అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమనౌక విడిపోయే ప్రక్రియ ముగియడంతో నాసా ప్రత్యక్ష ప్రసారం ఆపేసింది. ప్రస్తుతం ఆడియో ద్వారా మాత్రమే వివరాలు తెలుపుతోంది. బుధవారం తెల్లవారు జాము 2.15 గంటలకు మళ్లీ లైవ్ ప్రారంభం కావచ్చు. ఈ ప్రక్రియలు అన్నీ జరిగే వరకు అన్నీ అనుకూలిం చాల్సి ఉంటుంది. 2024 జూన్‌ 5న ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ ఇన్ని నెలలకు భూమి మీదకు వస్తున్నారు. అంతరిక్ష కేంద్రంలోనే సునీ తా విలియమ్స్‌ దీపావళి, థాంక్స్‌ గివింగ్‌ వంటి వేడుకలను జరుపు కున్నారు. డిసెంబర్‌లో ఐఎస్‌ఎస్‌ నుంచే విద్యార్థు లతో ఆమె మాట్లాడారు

  • Related Posts

    సురక్షితంగా భూమి పైకి చేరుకున్నసునీతా విలియమ్స్

    స్వాగతం సుస్వాగతం సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమి పైకి చేరుకున్నసునీతా విలియమ్స్ మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ :మార్చి 18: భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి, బూచ్ విల్మోర్ లు, పెట్టకేలకు భూమి పైకి చేరుకున్నారు దాదాపు 9…

    భువిపైకి సునీత.. చిరంజీవి ట్వీట్ !

    భువిపైకి సునీత.. చిరంజీవి ట్వీట్ ! మనోరంజని ప్రతినిధి మార్చి 19 – వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ క్షేమంగా భూమిపై ల్యాండ్ కావడంపై మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. 8 రోజుల్లో తిరిగొస్తామని వెళ్లి 286 రోజులకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మంథని: ఇందిరమ్మ ఇండ్ల పురోగతి నమోదు చేయాలి: కలెక్టర్

    మంథని: ఇందిరమ్మ ఇండ్ల పురోగతి నమోదు చేయాలి: కలెక్టర్

    సింగరేణి: పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి

    సింగరేణి: పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి

    పెద్దపల్లి: ఒత్తిడిని అధిగమించి పరీక్షలకు సిద్ధం కావాలి: డీసీపీ

    పెద్దపల్లి: ఒత్తిడిని అధిగమించి పరీక్షలకు సిద్ధం కావాలి: డీసీపీ

    రామగుండం: ఉద్యోగులకు క్వార్టర్ల కేటాయింపుకు కౌన్సిలింగ్

    రామగుండం: ఉద్యోగులకు క్వార్టర్ల కేటాయింపుకు కౌన్సిలింగ్