

హైదరాబాద్ నగరంలో కాల్పుల కలకలం
మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 29 – హైదరాబాద్ నగరం గుడి మల్కాపూర్లో కాల్పులు కలకలం సృష్టించాయి, గుడిమల్కాపూర్ లోని కింగ్స్ ప్యాలెస్లో ఆనం మీర్జా ఎక్స్పో జరుగుతు న్న , ప్రదర్శనలో ఇద్దరు దుకాణదారుల మధ్య వాగ్వాదం జరిగింది, ఈ క్రమంలోనే వారిలో ఒక దుకాణదారుడు గాలిలో కాల్పులు జరపడంతో అక్కడున్న వారిలో భయాందోళనకు గురయ్యారు. కాల్పుల శబ్దంతో సందడి నెలకొనగా, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు గాలిలో కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఎక్స్పో నిర్వాహకులు, ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఎక్స్పో ప్రాంతంలో భద్రతను పెంచినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటనతో ఎక్స్పోకు వచ్చిన ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే, పోలీసులు వెంటనే స్పందించడంతో పరిస్ధితి అదుపులోకి వచ్చిందని అక్కడి స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై ఇంకా వివరాలు అందుబాటులోకి రావాల్సి ఉంది