స్టూడెంట్ కమిటీలే పాఠశాల విజయానికి మూలస్తంబాలు-

*స్టూడెంట్ కమిటీలే పాఠశాల విజయానికి మూలస్తంబాలు-

పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాగుల చంద్రశేఖర్

మనోరంజని ప్రతినిధి కుబీర్ మార్చి 07 :- నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని సోనారి ప్రభుత్వ ప్రాథమికొన్నత పాఠశాల విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి సామాజిక స్పృహ కల్పించడానికి ప్రధానోపాధ్యాయులు బాగుల చంద్రశేఖర్ పాఠశాలలో డిస్ప్లేన్ కమిటీ మీడేమీల్స్ కమిటీ ప్రేయర్ కమిటీ హెల్పింగ్ హాండ్స్ కమిటీల పేరుతో విద్యార్థులను బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దడమే నినాదంగా స్టూడెంట్ కమిటీస్ ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ఈ కమిటీల నిర్వహణ బాధ్యతను 12 మంది విద్యార్థులకు అప్పగించడం జరిగింది.ఈ కమిటీల సభ్యులు ఉదయం పాఠశాలకు వారి వారి గల్లీలలో ఉన్న విద్యార్థులను పాఠశాలకు క్యూలైన్ లలో తీసుకురావడమం అదేవిధంగా పాఠశాల నుండి ఇంటికి వరసక్రమంలో తీసుకురావడం విద్యార్థులు ఆబ్సెంట్ కాకుండా చూడడం విద్యార్థుల చేత సాయంత్రం ఇంటిదగ్గర వారి చేత హోంవర్క్ చేయిస్తూ సామర్థ్యాలను పెంపొందించే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఉదయం ప్రార్థన సమయం లో ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల హాజరును సైతం కమిటీ సభ్యులే నమోదు చేయడం జరుగుతుందని వెల్లడించారు. మధ్యాహ్న భోజనం టెస్ట్ రిజిస్టర్ ను కూడా మిడ్ డే మీల్స్ కమిటీ సభ్యులే నిర్వహిస్తున్నారని చెప్పారు.పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను అభ్యసించడంలో ఆర్థికపరమైన లేదా ఇతరత్ర సమస్యలు ఏమైనా ఉంటే హెల్పింగ్ హాండ్స్ కమిటీ ఆధ్వర్యంలో వారికి సహాయం అందించే విధంగా విద్యార్థులు సమాయత్తం అవుతున్నారన్నారు. పాఠశాల ప్రారంభం మొదలు సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు పాఠశాలను విద్యార్థి కమిటీలే నిర్వహిస్తున్నాయని ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ తెలిపారు ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా తయారు చేయించిన వాలంటీర్ బ్యాడ్జిలను సైతం అందించడం జరిగిందని తెలిపారు.

  • Related Posts

    నేడు స్టేషన్‌ఘన్‌పూర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి..!!

    నేడు స్టేషన్‌ఘన్‌పూర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి..!! .800 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం స్వయం సహాయక సంఘాలకు రూ.100 కోట్ల రుణాల పంపిణీ అనంతరం కృతజ్ఞత సభలో ప్రసంగించనున్న సీఎం ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భారీగా ఏర్పాట్లు వరంగల్‌: ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆదివారం…

    బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తే రంగు పడుద్ది: సజ్జనార్

    బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తే రంగు పడుద్ది: సజ్జనార్ మనోరంజని ప్రతినిధి మార్చి 16 – ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారికి TGSRTC ఎండీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగానే వైజాగ్ లోకల్ బాయ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తమిళ భాషపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు

    తమిళ భాషపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు

    నేడు స్టేషన్‌ఘన్‌పూర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి..!!

    నేడు స్టేషన్‌ఘన్‌పూర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి..!!

    ఓటర్, ఆధార్ లింకింగ్‌పై 18న కీలక సమావేశం

    ఓటర్, ఆధార్ లింకింగ్‌పై 18న కీలక సమావేశం

    బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తే రంగు పడుద్ది: సజ్జనార్

    బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తే రంగు పడుద్ది: సజ్జనార్