సెర్ప్ అమలు చేస్తున్న పథకాలను ఈనెల 29 లోపు కష్టపడి లక్ష్యాన్ని సాధించాలి
పిడి డిఆర్డిఓ రాథోడ్ రవీందర్
మనోరంజని ప్రతినిధి ఆదిలాబాద్ మార్చి 11 :- గ్రామీణ ప్రాంతాలలో ని స్వయం సహాయక సంఘంలో ఉన్న పేదలు నిరుపేద మహిళల సంఘాల సభ్యుల అభివృద్ధి కోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అమలు చేస్తున్న పథకాలను ఈనెల 29 లోపు ప్రతి మండలాలలోని సీసీలు వివోఏలు ఏపీఎంలు ఇష్టపడి కష్టపడి పని చేసి ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లక్ష్యాన్ని పూర్తిగా నెరవేర్చాలని ఆదిలాబాద్ జిల్లా డిఆర్డిఓ రాథోడ్ రవీందర్ కోరారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో మానవ అక్రమ రవాణాపై నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో భాగంగా అయినా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా బ్యాంకు లింకేజ్ ఆర్జివికా రిజిస్ట్రేషన్ లో న్ బీమా ప్రమాద బీమా ఓటీఎస్ సంఘాలు రికవరీలో ఎన్పీఏ రుణాల వసూలు స్త్రీని ది తీరిక పోయిన మొండి బకాయిలు వసూలు చేయడంలో జిల్లా చాలా వెనుకబడి ఉందని. మండలాల వారీగా ఉన్న సమస్యలను సీసీలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్క సీసీ వివోఏ ఏపీఎం ఇష్టపడి కష్టపడి పనిచేస్తే సాధ్యపడింది ఏదీ ఉండదని ప్రతి ఒక్కరూ తమ లక్ష్యసాధన కోసం పనిచేయాలని అప్పుడే పేదల్లో నిరుపేదలలో మంచి గుర్తింపు వస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 15 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలు లోపు ఉన్న మహిళలతో కొత్త సంఘాలు ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించిందని ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో స్వయం శాఖ సంఘాలకు వివరించాలని సంఘం బయట ఉన్న ప్రతి ఒక్క మహిళను సంఘంలో చేర్పించి వారికి ఆర్థిక భరోసా కల్పించాలని కోరారు. పనిచేసే ఉద్యోగులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని మీకు పెండింగ్లో ఉన్నటువంటి ఇంక్రిమెంట్స్ కోసం ప్రత్యేకంగా మేడంతో గా మాట్లాడి మీ యొక్క సమస్య పరిష్కారం కోసం తనవంతుగా కృషి చేస్తానని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ప్రతి ఒక్క ఉద్యోగి ప్రతి నెల ఎవరి లక్ష్యం మేరకు వారు పనిచేసే వారి యొక్క పనితనాన్ని మెరుగుపరుచుకోవాలని సూచనలు చేశారు. ఈ సమావేశంలో అడిషనల్ డి ఆర్ డి ఓ బిట్ల గంగన్న డిపిఎంస్ ఏ శోభారాణి బి శోభారాణి హేమలత నరేందర్ సురుకుంటి వకుల స్ట్రినిది ఆర్ఎం పూర్ణచందర్ 17 మండలాల ఏపీఎంలో సీసీలు తదితరులు పాల్గొన్నారు