

సెక్రటేరియేట్పై డ్రోన్ కలకలం
మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 15 – తెలంగాణ సెక్రటేరియేట్పై డ్రోన్ కలకలం రేపింది. ఈ నెల 11న రాత్రి ఇద్దరు ఆగంతకులు డ్రోన్ ఎగరవేసినట్లు సెక్రటేరియేట్ సిబ్బంది సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వంశీ, నాగరాజు అనే ఇద్దరి అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్ కెమెరాతో సెక్రటేరియట్ అవుట్ పోస్ట్, లాన్ ఏరియా నిందితులు చిత్రీకరించినట్లు తెలుస్తోంది.