

సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు
గౌరవ నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి గారి ఆదేశానుసారం.
జగదీష్ రెడ్డి సస్పెన్షన్ అనైతికం.
అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజు సభాపతిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం దారుణం ప్రజా సమస్యలపై గొంతెత్తడం నేరమా.! కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తుంది.
తక్షణమే సస్పెన్షన్ ఎత్తివేయాలి
కేసీఆర్ నాయకత్వం లో మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతాం.
మాజీ శాసన సభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి గారు
ప్రజా సమస్యలపై అసెంబ్లీ వేదికగా గొంతెత్తిన మాజీ మంత్రివర్యులు సూర్యాపేట నియోజకవర్గ శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం అప్రజాస్వామిక చర్య అని బిఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు.
శనివారం స్థానిక నారాయణఖేడ్ లోని మహా రెడ్డి వెంకట్ రెడ్డి చేస్తాలో జగదీష్ రెడ్డి సస్పెన్షన్ కు వ్యతిరేకంగా భారత రాష్ట్ర సమితి నారాయణఖేడ్ నియోజక వర్గం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జగదీష్ రెడ్డి పైన తక్షణమే సస్పెనన్ ఎతివేయాలని పెద ఎతున నినాదాలు చేసి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ లక్ష్మీబాయి రవీందర్ నాయక్, మనూర్ మండల పార్టీ అధ్యక్షులు విట్టల్ రావు పటేల్, పట్టణ పార్టీ అధ్యక్షులు నగేష్ సేట్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ విట్టల్,ఖేడ్ మండల పార్టీ ఉపాధ్యక్షులు నర్సింలు ముదిరాజ్, మాజీ సర్పంచులు సంగప్ప, వెంకటేశం, సిద్ధూ, సురేష్, ప్రసాద్, కురుమ సంఘం తాలూకా ఉపాధ్యక్షులు మల్గొండ, నాయకులు పోచయ్య, చింటూ నరేష్, శ్రీనివాస్, శీను, సాయిలు,గణపతి తదితరులు ఉన్నారు.
