

సిసి రోడ్ల నిర్మాణానికి ఒక కోటి 92 లక్షలు మంజూరు
మనోరంజని ప్రతినిది ముధోల్ మార్చి 23 – నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని వివిధ గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా సిసి రోడ్లు- సైడ్ డ్రెన్ల నిర్మాణానికి మూడో విడతలో ఒక కోటి 92 లక్షలు మంజూరైనట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల గంగారెడ్డి తెలిపారు. గ్రామ అభివృద్ధికి సహకరిస్తూన్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ నారాయణరావు పటేల్, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల్ చారికి ధన్యవాదములు తెలిపారు. అదేవిధంగా నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి- జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్కకు ముధోల్ మండల కాంగ్రెస్ కార్యకర్తల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. నిధుల మంజూరుకు సంబంధించిన ప్రోసిడింగ్ కాఫీలను సైతం అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బెజ్జంకి ముత్యం రెడ్డి, నాయకులు రావుల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.