

సమాచార హక్కు చట్టం… రామబాణం
మనోరంజని ప్రతినిధి ఆర్ముర్ మార్చి 15 :- ఆర్మూర్ : పట్టణంలోని రాంమందిర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి,విద్యార్థులకు న్యాయవాది గటడి ఆనంద్ సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించారు ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తమకు కావలసిన సమాచారం తెలుసుకోవడానికి ఈ చట్టం దోహదపడుతుందని అలాగే అవినీతి అంతమొందాలంటే ఈ చట్టంతోని సాధ్యమన్నారు విద్యార్థి దశ నుండే విద్యార్థులు ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలన్నారు దరఖాసుదారుడు కోరిన సమాచారం 30 రోజుల్లో సంబంధిత అధికారి ఇవ్వాలన్నారు ఇవ్వని పక్షంలో పై అధికారికి అప్పీలు వెళ్లే అవకాశం ఉందన్నారు, ప్రభుత్వ అధికారి దరఖాస్దారునికి తప్పుడు సమాచారం, అసంపూర్తి సమాచారం, తప్పుదోవ పట్టిన అధికారికి రోజుకు 250 నుండి 25 వేల వరకు జరిమానా విధించే అధికారం ఉందన్నారు అలాగే దరఖాస్తు ఎలా చేయాలో ఈ చట్టం ద్వారా సాధించిన విజయాలు క్లుప్తంగా వివరించారు వార్షిక పరీక్షలో అత్యధిక మార్పులు సాధించిన విద్యార్థి విద్యార్థులకు 1000 రూపాయలు ప్రోత్సాహ బహుమతి ఇస్తానని చెప్పారు కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జి గంగాధర్ ఉపాధ్యాయులు చంద్రకాంత్ పద్మ మనోహర్ సురేందర్ నగేష్ సురేష్ రాజమణి చిన్నయ్య రాజన్న తదితరులు పాల్గొన్నారు