

శేర్లింగంపల్లి లో రంజాన్ సందర్భంగా తోఫాను అందజేసిన డా. రవీందర్ యాదవ్.
గిఫ్ట్ ఏ స్మైల్ బ్యాగులలో నిత్యవసర సరుకుల సరఫరా
మా నాయకుడు రవీందర్ యాదవ్ అని ముస్లిం సోదరుల ఆశీస్సులు
తామంతా రవీందర్ యాదవ్ వైపే నని ముక్తకంఠంతో ఆశీర్వదించిన ముస్లిం సోదరులు
శేరిలింగంపల్లిలోని స్థానికులకు నిత్యావసర సరుకులు అందజేత
కేటీఆర్ పిలుపు మేరకు ముస్లింలకు గిఫ్ట్ ఏ స్మైల్ తో కూడిన బ్యాగ్ లు
పర్యావరణాన్ని కాపాడేందుకు ప్లాస్టిక్ ను నిషేదిద్దాం అని పిలుపు
కేసీఆర్ పాలనలోనే ముస్లింలకు అభివృద్ధి ఫలాలు
సీఎం రేవంత్ తీరుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు
ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన రవీందర్ యాదవ్
మనోరంజని, హైదరాబాద్ ప్రతినిధి:
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లింలకు భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ తోఫాను అందజేశారు. శేరిలింగంపల్లిలోని స్థానిక ముస్లింలకు నిత్యావసర సరుకులను అందించిన రవీందర్ యాదవ్.. వారికి రంజాన్ శుభాకాంక్షలను తెలిపారు. భారాస వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గిఫ్ట్ ఏ స్మైల్ తో ముద్రించిన బ్యాగ్ తో పాటుగా నిత్యావసర సరుకులను అందజేసినట్లుగా వెల్లడించారు. కేటీఆర్ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. మనకు తోచిన విధంగా సహాయం చేద్దామని కోరారు. బ్యాగ్ లపై ప్లాస్టిక్ ను నిషేదిద్దాం అని పిలుపుతో పర్యావరణాన్ని కాపాడేందుక అందరూ సహకరించాలని విజ్నప్తి చేశారు. అలాగే ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ ను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారని వెల్లడించారు. భారాస పాలనలో ముస్లింలకు అండగా నిలిచారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్యాయానికి గురవుతున్నారని చెప్పారు. కేసీఆర్ పాలనలో మైనార్టీలకు పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం జరిగిందన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం చెందారని విమర్శించారు. ముస్లింలే కాదు సబ్బండ వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. షాదీ ముబారక్ తో పేద ముస్లింల వివాహానికి పెద్దన్నలా కేసీఆర్ అండగా నిలిచారని గుర్తు చేశారు. ఎన్నికలు ఎప్పడు జరిగినా భారాసనే అధికారంలోకి రాబోతుందని భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు