

శిశు మందిర్ని సందర్శించిన అగ్నిమాపక దళం
మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 01 నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రములోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలను భైంసా అగ్ని మాపక దళం (ఫైర్ స్టేషన్) ఎస్సై మదిపెల్లి రవి సందర్శించారు. ప్రార్థన కార్యక్రమంలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సరస్వతీమాత- ఓంకారం-భరతమాతల చిత్రపటాలకు పూలమాలలు వేసి నమస్కరించారు. అగ్ని మాపక దళ సేవలను అగ్ని ప్రమాదం సంభవించినపుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు తెలియజేశారు. తాను ఆదిలాబాద్ శిశు మందిర్ పూర్వ విద్యార్ధి కావడం ఆనందంగా ఉందని తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులతో కలిసి మాట్లాడారు విద్యార్థులలో గల భయాన్ని తొలగించి స్ఫూర్తిని నింపడం జరిగింది. ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ ఎస్సైకి పాఠశాల తరుపున ధన్యవాదాలు తెలియజేసి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానాచార్యులు సారథి రాజు, అకాడమిక్ ఇంచార్జీ దేవెందర్ చారి, ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు