

శాతవాహన యూనివర్సిటీలోనే ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలి –
బీఆర్ఎస్ విద్యార్థి విభాగం డిమాండ్
మనోరంజని ప్రతినిధి కరీంనగర్ మార్చి 29 :- శాతవాహన యూనివర్సిటీలో ఏర్పాటు చేయాల్సిన ఇంజనీరింగ్ కళాశాలను హుస్నాబాద్లో నెలకొల్పడం సరైన నిర్ణయం కాదని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కరీంనగర్ నగర అధ్యక్షుడు బొంకూరి మోహన్ అన్నారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులను రద్దు చేసి యూనివర్సిటీ క్యాంపస్లోనే కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.”హుస్నాబాద్లో కళాశాల ఏర్పాటుతో విద్యార్థులకు వసతి, రవాణా సమస్యలు వస్తాయి. కరీంనగర్లోనే కళాశాల ఉంటే ప్రభుత్వ హాస్టల్స్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. కాబట్టి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి” అని అన్నారు.అధికారంలో ఉన్నట్లు నిర్ణయాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తూ, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్బాబు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోతే బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పెద్దఎత్తున ఆందోళనలు చేస్తుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సముద్రల ఓంకార్, సయ్యద్ షోహైల్, మడిశెట్టి అజయ కుమార్, నాయిని అన్వేష్, మామిడిపల్లి సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు