

శనేశ్వర స్వామికి శాస్త్రోక్తంగా తిల,తైలా అభిషేక పూజలు….
*పరమశివునికి రుద్రాబిషేకలు,అర్చనపూజలు
మనోరంజని ప్రతినిధి నాగర్ కర్నూల్ : మార్చి 01 బిజినెపల్లి మండల పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామంలో ఫాల్గుణ మాసం విదియ శనివారం నాడు శ్రీసార్థాసప్త జేష్టమాత సమేత శనేశ్వర స్వామికి ప్రత్యేకంగా తిల తైల అభిషేకాల పూజలు నిర్వహించారు.
ఆలయ ప్రధానఅర్చకులు డాక్టర్ గవ్వమఠంవిశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ ఈ మాసం శనేశ్వర స్వామిని పూజించిన ఆరాధించిన పలితం ఉంటున్నది అనంతరం గోన బుద్ధారెడ్డి కాలంనాటి బ్రహ్మ సూత్రం గల పరమశివునికి ఈరోజు భక్తులచే సామూహిక రుద్రాభిషేకపూజలు,అర్చనలు ప్రత్యేకంగా నిర్వహించినట్లు తెలిపారు. భారతీయ స్టేట్ బ్యాంక్ఉమ్మడి జిల్లా నైపుణ్య శిక్షణ అధికారి శ్రీనివాస్ స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు.భక్తులు జమ్మి చెట్టుకు19 ప్రదక్షణలు వేదమంత్రచరణల మధ్య చేశారు.గణపతి,నందీశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాదాల పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఆలయ ఆలయ కమిటీ సభ్యులు కేంచే రాజేష్ ప్రభాకర్,పుల్లయ్య, వీర శేఖర్,ఆలయ ఆర్చకులు గవ్వమఠం శాంతి కుమార్, ఉమమహేశ్వర్,సిబ్బంది గోపాల్ రెడ్డి భక్తులు, మహిళలు,అధిక సంఖ్యలో పాల్గొన్నారు
