

విద్యుత్ ఘాతంతో ఇల్లు దగ్ధం..
విద్యుత్ ఘాతం తో ఇల్లు దగ్ధమై ఇంట్లోని విలువైన సామాగ్రి అగ్నికి ఆహుతి..
ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ బాధిత కుటుంబానికి పరామర్శ…

మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి08 :- నిర్మల్ జిల్లా నర్సాపూర్ -G మండలంలోని బుర్గుపల్లి గ్రామానికి చెందిన రాథోడ్ దినేష్ ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధం అయిన విషయం తెలిసిన బాధిత కుటుబాన్ని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పరామర్శించారు. అగ్ని ప్రమాదానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. కాలిపోయిన ఇళ్లను పరిశీలించారు.సుమారుగా నగదు 4 లక్షలు, వస్తుసామగ్రి 4 లక్షలు విలువ గల, ఇళ్లు కాలి బూడిదైన వారి కుటుంబం ఆయన వద్ద బోరున విలపించగా ఆయన బాధితులను ఓదార్చారు. వారికి మనోధైర్యం నింపారు. బాధిత కుటుంబనికి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా నష్టపహారం అందెల చూస్తానని , వారికీ పక్కా ఇళ్లు మంజూరు చేయాలని ఆయన సంబంధిత అధికారులను సూచించారు.