విడుదల రజనీ ఆమె మరిది గోపి పై… మరో కేసు రెడీ

విడుదల రజనీ ఆమె మరిది గోపి పై… మరో కేసు రెడీ

వైసీపీ నేత మాజీ మంత్రి విడుదల రజిని కష్టాలు రోజురోజుకు రెట్టింపు అవుతున్నాయి. ఇటీవల స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించిన వ్యవహారంలో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం రాజకీయంగా పెద్ద ఎత్తున సంచలనంగా మారింది.

రజనీపై నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఢిల్లీ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం ఇక్కడితో ఆగదని తాను ముందుకు తీసుకువెళ్తానంటూ లావు కృష్ణదేవరాయులు విడుదల రజనీకి వార్నింగ్ ఇచ్చారు.

స్టోన్ క్రషర్ యజమాని నుంచి ఆమె రెండు కోట్ల రూపాయలు రాత్రి 11 గంటల సమయంలో తీసుకున్నట్లుగా సాక్షాలను కూడా పోలీసులు సేకరించారు. వాటి ఆధారంగానే గవర్నర్ అనుమతితో ఆమెపై కేసు నమోదయింది. ఇక తాజాగా ఆమె మరిది గోపి వ్యవహారం మరోసారి రజనీకి తలనొప్పిగా మారే అవకాశాలు కనబడుతున్నాయి. తాజాగా రజిని ఆమె మరిది గోపి పై జిల్లా ఎస్పీకి ఒక ఫిర్యాదు చేశారు.

చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం వీరిపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 2022 ఏప్రిల్ లో రజనీ అక్రమాలను తాను ప్రశ్నించినందుకు తన ఇంటిపై ఆమె దాడి చేయించారని అందులో ప్రస్తావించారు.

దాదాపు 100 మంది వచ్చి తనపై దాడి చేశారని తన కారుని ఇంట్లో ఫర్నిచర్ ని నాశనం చేశారని అలాగే మూడు రోజులపాటు విధ్వంసం సృష్టించి తనను తన కుటుంబ సభ్యులను చిత్రహింసల గురి చేశారని సుబ్రహ్మణ్యం ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసిన సరే పట్టించుకోలేదని నామమాత్రంగా కేసు నమోదు చేసినట్టు ఆయన ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రజనీపై ఆమె మరిదిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఎఫ్ఐఆర్ లో వారిద్దరి పేర్లు చేర్చాలని కోరారు.

  • Related Posts

    బైకుపై మృతదేహంతో నిరసన.

    బైకుపై మృతదేహంతో నిరసన. మనోరంజని స్టేట్ ఇంచార్జ్ ఆంధ్ర ప్రదేశ్: ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం ఎర్రంపేటకు చెందిన దార్ల హేమ దుర్గా ప్రసన్నను (31) గంగన్నగూడెం గ్రామానికి చెందిన మోదుగ సాయి బలవంతంగా లోపర్చుకొని ఆమెతో ఏకాంతంగా ఉన్న వీడియోలను…

    హీటెక్కిన ఆంధ్రప్రదేశ్‌.. 150కి పైగా మండలాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

    హీటెక్కిన ఆంధ్రప్రదేశ్‌.. 150కి పైగా మండలాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు మచిలీపట్నంలో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత… విజయవాడ: వడగాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఠారెత్తాయి. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో సగటున 40 డిగ్రీలకు చేరాయి. సాధారణం కంటే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం