

వాలంటీర్ ఆత్మహత్య కలకలం రేపుతోంది…
జిల్లా లో ఆన్ లైన్ బెట్టింగ్ యువకుడి ఉసురు తీసింది…
బెట్టింగ్ ఊబిలో పడి తెరుకోలేక అప్పు మీద అప్పు చేసి తీర్చేందుకు స్తోమత లేక చివరికి ఆత్మహత్య చేసుకున్న ఘటన నంద్యాల జిల్లా లో చోటుచేసుకుంది…
జిల్లా లోని కొలిమిగుండ్ల మండలం గోర్వి మాను పల్లె గ్రామనికి చెందిన బలిజ మహేంద్ర (28) వాలంటీర్ గా పని చేస్తూ ఉండేవాడు , కూటమి ప్రభుత్వం వచ్చాక ఉన్న వాలంటీర్ ఉద్యోగం పోయింది , దగ్గరలోని సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసుకుంటు ఉన్న మహేంద్ర నేడు అప్పుల బాధ తాళలేక రైలు క్రింద తల పెట్టి ఆత్మహత్య కు పాల్పడ్డాడు…
పోలీసులు ఎంత చెప్పినా నేటి యువత ఆన్ లైన్ బెట్టింగ్ లకు బానిసలై విలువైన జీవితాలను తుదముట్టిస్తున్నారు…
ఇప్పటి కైనా బెట్టింగ్ లకు దూరంగా ఉండాలని ఆసిస్తూ…