పల్సి ఉన్నత పాఠశాల లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం….
మనోరంజని ప్రతినిధి కుబీర్ మార్చి 08 :- నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పల్సి గ్రామంలోని ఉన్నత పాఠశాలలో శనివారం ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా పాఠశాల లో పనిచేస్తున్నటువంటి మహిళా ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించారు. సందర్బంగా మహిళలకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. అనంతరం విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ…. తల్లి ఒడి నుండి తరగతి గది, అవని నుండి అంతరిక్షం దాకా, సాగర గర్భం నుండి సాంకేతికత దాకా, ప్రతి రంగంలో మహిళలు వేగంతో దూసుకెళ్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సురేష్, ఉపాధ్యాయులు సాయికుమార్, భాస్కర్ రెడ్డి, ఎర్రన్న, మధుసూదన్, లింగమూర్తి, ఎల్లన్న, సంజు, మహిళల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.