లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రెవెన్యూ ఇన్స్పెక్టర్
మనోరంజని ప్రతినిధి మెదక్ మార్చి 11 :- తెలంగాణలో అవినీతి అధికారుల పై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా మెదక్ పట్టణ & జిల్లా పురపాలక కార్యాలయ రెవెన్యూ ఇన్స్పెక్టర్ నకిరేకంటి జానయ్య ఓపెన్ ప్లాట్ మ్యుటేషన్ దరఖాస్తును మంజూరు చేయడానికి రూ. 20,000 లంచం డిమాండ్ చేశాడు. ఫిర్యాదుదారుడు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు తెలియజేయగా, ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి సన్నాహం చేసింది. ఫిర్యాదుదారుడి అభ్యర్థన మేరకు లంచం మొత్తాన్ని రూ. 12,000కి తగ్గించి, నగదు స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అవినీతి అధికారులు ప్రజల రక్తం తాగుతూనే ఉన్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ ఒక్కరూ అవినీతిపై పోరాడాలని, ఎవరైనా లంచం అడిగితే 1064 నంబర్కు కాల్ చేయాలని అధికారుల సూచన