రోహిత్, కోహ్లీ తర్వాత జడేజా.. రిటైర్మెంట్ వార్తలపై జడేజా స్పందన ఏంటంటే..

రోహిత్, కోహ్లీ తర్వాత జడేజా.. రిటైర్మెంట్ వార్తలపై జడేజా స్పందన ఏంటంటే..

ఆదివారం దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డేలకు గుడ్ బై చెబుతారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రోహిత్, కోహ్లీ కూడా తమ రిటైర్మెంట్ వార్తలను కొట్టిపడేశారు. ఈ మ్యాచ్‌తో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా వన్డేల నుంచి వైదొలుగుతాడని చాలా మంది అనుకున్నారు. ఫైనల్ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా పది ఓవర్ల స్పెల్ పూర్తి చేసిన వెంటనే కోహ్లీ వెళ్లి అతడిని కౌగిలించుకున్నాడు. చివరి మ్యాచ్‌లో తన కోటా బౌలింగ్ పూర్తి చేయడంతోనే జడేజాను కోహ్లీ కౌగిలించుకున్నాడని చాలా మంది ఊహించారు. ఆ మేరకు మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. ఆ వార్తలపై తాజాగా రవీంద్ర జడేజా స్పందించాడు. అనవసరపు రూమర్స్ వద్దు.. ధన్యవాదాలు అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశాడు. దీంతో రవీంద్ర జడేజా రిటైర్మెంట్ కూడా ఊహాగానమే అని క్లారిటీ వచ్చింది. జడేజా మరింత కాలం వన్డేల్లో కొనసాగుతాడని స్పష్టత వచ్చింది.

ధోనీ సారథ్యంలో 2013లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన టీమిండియాలో రవీంద్ర జడేజా కూడా సభ్యుడే. ఆ సీజన్‌లో జడేజా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఫైనల్ మ్యాచ్‌లో చక్కగా రాణించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అలాగే తాజాగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కూడా మంచి ప్రదర్శన కనబరిచాడు. పది ఓవర్లు బౌలింగ్ చేసి 30 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ తీశాడు. అలాగే విన్నింగ్ రన్స్ కూడా కొట్టి భారత్‌కు విజయాన్ని అందించాడు.

  • Related Posts

    అరుదైన మైలురాయిని అందుకున్న ఫోన్ పే

    అరుదైన మైలురాయిని అందుకున్న ఫోన్ పే ఫిన్ టెక్ దిగ్గజాల్లో ఒకటైన ఫోన్ పే మరో మైలురాయికి చేరుకున్నది. తాజాగా 60 కోట్ల మంది కంపెనీ సేవలు పొందుతున్నారని పేర్కొంది. ఆర్థిక సేవలు ప్రారంభించి పదేండ్లు పూర్తైన సందర్భంగా ఈ కీలక…

    భూమి మీదకు రానున్న సునీతా విలియమ్స్!

    భూమి మీదకు రానున్న సునీతా విలియమ్స్! మనోరంజని ప్రతినిధి మార్చి 12 – సాంకేతిక సమస్యలతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుపోయిన సునీతా విలియమ్స్ భూమి మీదకు రానున్నారు. భారత సంతతికి చెందిన NASA వ్యోమగామి సునీతా 9 నెలలుగా అంతరిక్షంలోనే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల.

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల.

    సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీఎంకే నేతలు.. కారణమిదేనా..

    సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీఎంకే నేతలు.. కారణమిదేనా..

    రేపు జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం

    రేపు జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం

    జగన్‌, కేసీఆర్‌లకు చివరి చాన్స్ !

    జగన్‌, కేసీఆర్‌లకు చివరి చాన్స్ !

    ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్

    ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్

    ఫామ్‌హౌస్ కేసు.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీకి రెండోసారి నోటీసులు..

    ఫామ్‌హౌస్ కేసు.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీకి రెండోసారి నోటీసులు..