రేషన్ డీలర్ల కమిషన్ల నిధులను విడుదల చేయండి :ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

రేషన్ డీలర్ల కమిషన్ల నిధులను విడుదల చేయండి :ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

శాసనమండలిలో మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 15 : గత మూడు నెలలుగా కమిషన్ల నిధులు రాక రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి శనివారం శాసనమండలిలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రూ. 70 కోట్లకు పైగా నిధులు బకాయిలు ఉన్నాయని, ఇటీవలనే చేగుంటలో రేషన్ డీలర్ ప్రభాకర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని, నిధులను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ రేషన్ డీలర్లకు 5000 వేతనం, 300 కమిషన్ ఇస్తామని ఎన్నికల సమయం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. గురుకుల పాఠశాలలో విద్యార్థుల అవస్థలు కొనసాగుతూనే ఉన్నాయని, విద్యార్థులు అనారోగ్యాల బారినపడి చెందుతున్నారని, ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సభ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం గురుకుల పాఠశాలల పురోగతిపై దృష్టి సారించాలని సూచించారు. గురుకుల పాఠశాలలో ముఖ్యంగా పేద విద్యార్థులు చదువుతారనే విషయాన్ని గ్రహించి, వాళ్లకు పౌష్టికాహారాన్ని ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని నవీన్ రెడ్డి సూచించారు

  • Related Posts

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను…

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్