

రాష్ట్ర స్పేస్ టెక్నాలజీ సలహాదారుగా సోమనాథ్
మనోరంజని ప్రతినిది మార్చి 20 – ఆంధ్రప్రదేశ్ : రాష్ట్ర స్పేస్ టెక్నాలజీ సలహాదారుగా ఇస్రో మాజీ చీఫ్ సోమనాథ్ను కూటమి ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో బుధవారం సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. పరిశ్రమలు, పరిశోధనలు, స్మార్ట్ సిటీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, శాటిలైట్స్, రిమోట్ సెన్సింగ్, కమ్యూనికేషన్ టెక్నాలజీపై సలహాలు ఇవ్వాలని కోరింది. అలాగే ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అడ్వైజర్గా కేపీసీ గాంధీని నియమించారు.