రామాలయంలో ఏప్రిల్ 4న శాస్త్రీయ నృత్య కళా పోటీలు

రామాలయంలో ఏప్రిల్ 4న శాస్త్రీయ నృత్య కళా పోటీలు

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 29 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండల అష్టా గ్రామంలో ఇటీవల శ్రీ రామాలయాన్ని నిర్మించారు. అందులో భాగంగా శ్రీరామనవమి సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి కాకుండా ఇతర జిల్లాల నుంచి నృత్య కళాకారులను తమ ప్రదర్శనలను ప్రదర్శించుటకు అష్టా శ్రీ రామాలయ కమిటీ ఆధ్వర్యంలో శాస్త్రీయ నృత్య పోటీలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 4 నుండి తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా ఆలయ కమిటీ వారు ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 4 నుండి సాంస్కృత కార్యక్రమంలో భాగంగా ఆసక్తిగల కళాకారులను తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. వచ్చేనెల నాలుగో తేదీ నుండి సంస్కృతి కార్యక్రమాలు ఉండగా సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు సంస్కృతిక, క్లాసికల్ నృత్యలు, జానపద నృత్యాలు, సెమి క్లాసికల్, వెస్టిన్ జానపద నృత్యాలకు పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ పోటీల్లో పాల్గొనేవారు శ్రీ రామాలయ కమిటీ సభ్యులకు సంప్రదించాలన్నారు. పాటకు ఉండే నాలుగు నిమిషాల సమయంలో పూర్తిచేసి సమన్వయంతో సమయపాలన పాటించి, నృత్య పోటీల్లో పాల్గొనేవారు సంప్రదాయ దుస్తులను ధరించి ఎటువంటి ప్రమాదకర విన్యాసాలు చేయకుండా అందరికీ ఆకట్టుకునేలా నృత్యాలు ఉండాలని పేర్కొన్నారు. ప్రదర్శన కారులో ఎవరి దుస్తులు వారు తీసుకొని రావాలని కోరారు. కళాకారులకు భోజన సౌకర్యం ఉంటుందని, కళాకారుల నైపుణ్యతను బట్టి పారితోషక ఉంటుందని ఆలయ కమిటీ పేర్కొంది. పారితోషంతోపాటు ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి ప్రశంస పత్రంతో పాటు మంచి పారితోషకం ఉంటుందని, ముధోల్ మండలంలోని గ్రామాలు తరలిరావాలని, స్వామి వారి వద్ద జరిగే నృత్య కళాకారులు చేసే విన్యాసాలను తిలకించాలని శ్రీ రామాలయ కమిటీ చైర్మన్ సంతోష్ రెడ్డి, నిర్వాహకులు రావుల శ్రీనివాస్ పత్రిక ప్రకటనలో వారు తెలిపారు

  • Related Posts

    రాములవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

    కామోల్ లో ప్రారంభమైన శ్రీరామనవమి ఉత్సవాలు మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 30 :- నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని కామోల్ గ్రామంలో సీతారామచంద్రస్వామి ఆలయంలో ఉగాది పర్వదిన వేళ శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆలయంలో తొమ్మిది రోజులపాటు ప్రత్యేక వేడుకలు…

    శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా బీజేపీ కార్యాలయంలో సుదర్శన హోమం

    తెలుగువారి కొత్త సంవత్సరోత్సవం అయిన ఉగాది సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భక్తి శ్రద్ధలతో సుదర్శన హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.హోమం అనంతరం నిర్వహించిన పంచాంగ శ్రవణంలో కిషన్ రెడ్డి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం