

రామగుండం: ఉద్యోగులకు క్వార్టర్ల కేటాయింపుకు కౌన్సిలింగ్
మనోరంజని ప్రతినిధి మాఎచి 2౦ – రామగుండం- 3 ఏరియా జీఎం ఆదేశాల మేరకు బుధవారం ఆర్జీ-3, అడ్రియాల ప్రాజెక్టు ఏరియాలలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు సెంటినరీ కాలనీలోని సెక్యూరిటీ కార్యాలయ ఆవరణలో క్వార్టర్ల కేటాయింపు కౌన్సిలింగ్ నిర్వహించారు. మొత్తం 174 ఖాళీ క్వార్టర్లు ఉండగా, ఫ్రెష్ అలాట్మెంట్, చేంజ్ ఆఫ్ క్వార్టర్లకు 46 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకోగా, 25 మంది ఉద్యోగులు హాజరై, 22 మంది క్వార్టర్లను ఎంపిక చేసుకున్నారు