రాజీవ్ యువ వికాస పథకం సద్వినియోగం చేసుకోవాలి

రాజీవ్ యువ వికాస పథకం సద్వినియోగం చేసుకోవాలి – ఆదివాసి కాంగ్రెస్ చైర్మన్ బాణావత్ గోవింద నాయక్

మనోరంజని ప్రతినిధి ఖానాపూర్ మార్చి 20 :- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ యువ వికాస పథకం హర్షించదగినదని ఆదివాసి కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్ పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువత స్వయం ఉపాధి పొందే అవకాశాలు కలుగుతాయని అన్నారు.ఈ పథకంలో ప్రతి నియోజకవర్గంలో 5,000 మంది చొప్పున, మొత్తం ఐదు లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.6000 కోట్లు మంజూరు చేసింది. ఒక్క లబ్ధిదారుడికి రూ.4 లక్షల వరకు రుణాన్ని అందించడంతోపాటు 60-80 శాతం వరకు రాయితీ ఇవ్వడం గమనార్హమన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సోమవారం ప్రారంభమై, ఏప్రిల్ 5 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఆసక్తి ఉన్న యువత ఆధార్ కార్డు, కుల, ఆదాయ సర్టిఫికెట్లు జతచేసి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 6 నుండి మే 31 వరకు అప్లికేషన్ వెరిఫికేషన్ జరుగుతుందని, అర్హత పొందిన లబ్ధిదారులకు జూన్ 2న, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున మంజూరు పత్రాలు అందజేస్తారని చెప్పారు

  • Related Posts

    ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు

    ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు మనోరంజని ప్రతినిధి లోకేశ్వరం మార్చి 21 :- పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు కఠోరమైన ఉపవాస దీక్షలు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం లోని పంచగూడి గ్రామంలో శుక్రవారం ముస్లిం సోదరులకు మాజీ…

    బెట్టింగ్ యాప్​లకు మరో యువకుడు బలి

    బెట్టింగ్ యాప్​లకు మరో యువకుడు బలి మనోరంజని ప్రతినిధి పెద్దపల్లి మార్చి 21 :- పెద్దపల్లి జిల్లా మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన 25 ఏళ్ల కోరవేన సాయి తేజ బెట్టింగ్ యాప్‌ల ప్రభావంతో తీవ్రంగా నష్టపోయాడు. గోదావరిఖనిలోని ఓ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు

    ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు

    బెట్టింగ్ యాప్​లకు మరో యువకుడు బలి

    బెట్టింగ్ యాప్​లకు మరో యువకుడు బలి

    ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తత ఆదేశాలు

    ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తత ఆదేశాలు

    నర్సింగాపూర్, కిష్టాపూర్ గ్రామపంచాయతీలను సందర్శించిన ఎంపీ ఓ.

    నర్సింగాపూర్, కిష్టాపూర్ గ్రామపంచాయతీలను సందర్శించిన ఎంపీ ఓ.