రక్తదానం చేయండి – నిండు ప్రాణాలు కాపాడండి

మనోరంజని ప్రతినిది భైంసా మార్చి 21 – నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో శుక్రవారం జి.డి.ఆర్ ఆసుపత్రిలో బల్గాం గ్రామానికి చెందిన సునీతకు వైద్యురాలు దీప జాదవ్ వైద్య పరీక్షలు నిర్వహించారు. రోగికి అత్యవసరంగా రక్తం అవసరమని తెలియడంతో బ్లడ్ డోనర్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు సురేష్‌ను సమాచారం అందించారు. సురేష్ చర్యతో రక్తదాత సంజు వెంటనే స్పందించి రక్తనిది నిల్వ కేంద్రంలో రక్తదానం చేసి ప్రాణాలను కాపాడారు. ఈ సందర్భంగా సంజు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని, దీనివల్ల అనేకమంది ప్రాణాలు నిలుపుకోవచ్చని అన్నారు. రక్తదాత సంజును ఆసుపత్రి నిర్వాహకులు, ఇతర పలువురు అభినందించారు. రక్తదానం చేయడం ద్వారా సామాజిక సేవలో భాగస్వామ్యం కావాలని, నిండు ప్రాణాలను కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు.

  • Related Posts

    శ్రీ వందన ఆసుపత్రి ఉచిత వైద్య సేవలు అభినందనీయం –

    శ్రీ వందన ఆసుపత్రి ఉచిత వైద్య సేవలు అభినందనీయం – వి. సత్యనారాయణ గౌడ్ మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 21 :- నిర్మల్ జిల్లా సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో శ్రీ వందన ఆసుపత్రి ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్య…

    వేసవిలో ఈ జ్యూస్ తాగారంటే..

    వేసవిలో ఈ జ్యూస్ తాగారంటే.. మండుటెండలతో జనాలు అల్లడిపోతున్నారు. ఎండల నుంచి ఉపశమనం పొందడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే సహజసిద్ధంగా శరీరాన్ని చల్లగా ఉంచడంలో కీరదోసకు మించిన ఆప్షన్‌ మరొకటి లేదు. కీర ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త పోలీస్‌ బాస్‌ ఎంపికపై కసరత్తు ప్రారంభించింది.

    ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త పోలీస్‌ బాస్‌ ఎంపికపై కసరత్తు ప్రారంభించింది.

    గుండె పోటుతో ఆర్ ఎంపీ వైద్యులు మృతి

    గుండె పోటుతో ఆర్ ఎంపీ వైద్యులు మృతి

    23-03-2025 / ఆదివారం / రాశి ఫలితాలు

    23-03-2025 / ఆదివారం / రాశి ఫలితాలు

    KCR | సింగిల్‌గానే మళ్లీ అధికారంలోకి వస్తాం.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు….!!

    KCR | సింగిల్‌గానే మళ్లీ అధికారంలోకి వస్తాం.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు….!!