

మనోరంజని సంగారెడ్డి, మార్చి 27, 2025: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో పేద ముస్లిం మహిళలకు వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సంఘం జిల్లా అధ్యక్షుడు జావేద్, పట్టణ అధ్యక్షుడు అంతయ్య నహీ, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రాజేశ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జావేద్ మాట్లాడుతూ, “రంజాన్ పర్వదినం అన్ని మతాల ప్రజల ఐక్యతకు ప్రతీక. పేదలకు సహాయం చేయడం ద్వారా సంతోషాన్ని పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం” అని అన్నారు. పట్టణ అధ్యక్షుడు అంతయ్య నహీ, విద్యార్థి సంఘం అధ్యక్షుడు రాజేశ్ మాట్లాడుతూ, “సమాజంలో ఉన్న అణగారిన వర్గాలకు తోడుగా నిలబడటమే మా ధ్యేయం. రంజాన్ సందర్భంగా పేద మహిళలకు సాయం చేయడం ఆనందంగా ఉంది” అని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, బీసీ యువజన సంఘం సభ్యులు, ముస్లిం సోదరులు పాల్గొని రంజాన్ వేడుకల్లో భాగస్వామ్యం అయ్యారు.