

మోహ లడ్డు తయారు చేయండి. గిరిజన మహిళలకు ఉపాధి మార్కెట్ సౌకర్యం కల్పిస్తాము.
పీడి డిఆర్డిఓ రాథోడ్ రవీందర్..
మనోరంజని ప్రతినిధి ఆదిలాబాద్ మార్చి 27 :- ఆదిలాబాద్ జిల్లా మారుమూల మండలమైన నార్నూరు మండలంలోని ఖైరత్వాడ గ్రామంలోని గిరిజన మహిళా సంఘాల సభ్యులు మొహా లడ్డు యూనిట్ పెట్టుకొని మొహాలు అడ్డును తయారు చేస్తున్న విధానాన్ని చూడడానికి గురువారం పిడి డిఆర్డిఓ రాథోడ్ రవీందర్ జిల్లా పరిషత్ డిప్యూటీ సి ఓ రాథోడ్ రాజేశ్వర్ నీతి ఆయోగ్ అధికారి రాహుల్ ఖైరత్ వాడ గ్రామంలో మొహాలడ్డు తయారు చేస్తున్న పరిశీలించి అభినందించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మోహన్ లడ్డు తయారీతో నార్నూర్ మండలంలోని మారుమూల గ్రామాలలో నివసిస్తున్న గిరిజన మహిళా సంఘాలకు మంచి ఉపాధి పొందవచ్చని మోహ లడ్డు అనేది ఒక సహజ వనరుగా లభిస్తుందని . అడవిలో సహజ సిద్ధంగా చెట్టుకు కాసిన ఇప్ప పువ్వును తీసుకువచ్చి ఎండబెట్టి ఆ తర్వాత ఈ మొహాలు లడ్డు తయారీలో బెల్లము లవంగాలు ఇలాయిచీ లాంగ్ కాజు కిస్మిస్ సుగంధ ద్రవ్యాలు తో మొహా లడ్డు తయారు చేస్తున్న పద్ధతిని చూసి గిరిజన మహిళలకు వారు అభినందించారు. రాబోయే రోజులలో ఈ మోహ లడ్డులకు భారీగా డిమాండ్ పెరుగుతుందని. ఆ డిమాండ్ ని దృష్టిలో పెట్టుకొని నార్నూర్ మండలానికి మోహ లడ్డు తయారు చేసే మండలం గా పేరు తీసుకురావాలని గిరిజన మహిళలను కోరారు. మహా లడ్డు తయారీ యూనిట్ ని పరిశీలించిన వారిలో డి ఆర్ డి ఎ ఫైనాన్స్ డిపిఎం బానోతు నరేందర్ ఫామ్ ఏపిఎం రా పెళ్లి స్వామి నార్నూర్ ఏపీఎం మైసా రమేష్ మోహ లడ్డు తయారు చేస్తున్న. మహిళలు సిసి కామ్లె సంతోష్ తదితరులు పాల్గొన్నారు.