ఇన్స్టాగ్రామ్,వాట్సాప్ లో వేదింపులు…మైనర్ బాలిక ఆత్మహత్య...వేదింపులకు గురిచేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని రహాదారిపై బైటాయించిన కుంటుంబికులు..
ఆదివారం నిర్మల్ జిల్లా భైంసాలొని పులేనగర్ లొ ఇన్ స్టాగ్రామ్,వాట్సాప్ లొ వేదింపులను వేగలేక 8వ తరగతి చదివే ఓ మైనర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బైంసా పట్టణంలో చోటుచేసుకుంది.
అదే గల్లీకి చెందిన ఓ దళితుడు సోషల్ మీడియా ద్వారా రోజు వేదింపులకు గురిచేస్తున్నాడని ఇంట్లొ ఉరి వేసుకొని మైనర్ బాలిక (కదం కోమల్) ఆత్మహత్యకు పాల్పడింది.
తమకు న్యాయం చెయ్యాలని కుటుంబికులు బస్టాండ్ ముందు రాస్తారోకొ నిర్వహించారు.
భైంసా ఎస్పీ అవినాష్ కుమార్ సంఘటణ స్థాలానికి చేరుకొని నిందితుడిని పట్టుకుంటామని చెప్పడంతొ నిరసనదారులు శాంతించారు.
ప్రస్తుతం నిందితుడు పరారీలొ ఉన్నాడని పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బైంసా పట్టణంలోని పులే నగర్ కాలనీకి చెందిన కదం కోమల్ ఓ ప్రైవేట్ పాఠశాలలొ ఎనిమిదో తరగతి చదువుతుంది ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు