మనోరంజని ప్రతినిధి హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. నాలుగు దశాబ్దాలకు పైగా సినిమా పరిశ్రమకు చేస్తున్న సేవలకు గానూ .. వ్యక్తిగతంగా చేసిన దాతృత్వానికి.. ఆదర్శప్రాయమైన ఆయన కృషిని యూకే ప్రభుత్వం గుర్తించింది. ఈ సందర్భంగా పార్లమెంట్ లోని హౌస్ ఆఫ్ కామన్స్లో చిరంజీవిని సత్కరించనుంది. ప్రజా సేవలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు మెగాస్టార్ చిరంజీవికి ఈ నెల 19న‘జీవిత సాఫల్య పురస్కారం’ ప్రధానం చేయనుంది..